Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. కత్తులు, గొడ్డళ్లతో వెంటాడి.. చివరకు..

హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా.. ఓ వ్యక్తిని కొందరు దుండగులు మర్డర్‌ చేయడం కలకలం రేపుతోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.. వ్యక్తి దారుణ హత్య హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో చోటుచేసుకుంది.. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగకాలనీలో ..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. కత్తులు, గొడ్డళ్లతో వెంటాడి.. చివరకు..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 23, 2025 | 1:40 PM

హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా.. ఓ వ్యక్తిని కొందరు దుండగులు మర్డర్‌ చేయడం కలకలం రేపుతోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.. వ్యక్తి దారుణ హత్య హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో చోటుచేసుకుంది.. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగకాలనీలో శనివారం అర్ధరాత్రి బొడ్డు మహేష్‌ అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపడం సంచలనం సృష్టిస్తోంది. ముందుగా కారుతో ఢీకొట్టగా.. మహేష్‌ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. వెంటాడి మరీ కత్తులు, గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

ఇక.. మృతుడు బొడ్డు మహేష్‌.. ఇటీవలే ఓ కేసులో బెయిల్‌పై బయటకొచ్చాడు. దాంతో.. పాతకక్షలతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. మహేష్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్లాన్‌ ప్రకారమే కొందరు వ్యక్తులు మహేష్‌ను హత్య చేశారని ఆరోపించారు.

వీడియో చూడండి..

అయితే మృతుడు మహేశ్ గతంలో ఓ క్లినిక్ లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసి జైలుకు వెళ్లాడు. ఇటీవల బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ఈ సమాచారం అందుకున్న ప్రత్యర్థులు అతన్ని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా.. శనివారం అర్ధరాత్రి గొడ్డళ్లతో వెళ్లి మహేశ్ పై దాడి చేశారు. ఈ దాడిలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పేర్కొంటున్నారు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..