Hyderabad: రమ్మీ ఆడుతున్న మమ్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. కిట్టి పార్టీ పేరుతో గ్యాంబ్లింగ్ నిర్వహణ..

మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక టేబుల్ లో ఏడు మంది మహిళలు ఆడుతుండగా మరో టేబుల్ లో ఐదు మంది మహిళలు టీన్ పాటీ ఆడుతున్నారు. మీరు వద్ద నుండి లక్ష రూపాయల పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 13 మంది మహిళల్లో అందరూ 50 కు పై బడి వయసు ఉన్నవారే.

Hyderabad: రమ్మీ ఆడుతున్న మమ్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. కిట్టి పార్టీ పేరుతో గ్యాంబ్లింగ్ నిర్వహణ..
Gambling
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 30, 2023 | 9:51 AM

వాళ్ళంతా 50 యేళ్లు వయసు పై బడిన ఆంటీలు. రాత్రి 9;30 కి ఇళ్ళలో ఉండాల్సిన వాళ్ళు, పోలీసు స్టేషన్ లో ఉన్నారు. వీళ్ళందరు లక్షలు టీన్ పాటి ఆడుతున్న కారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మధుర నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 27 న మధుర నగర్ ఒక అపార్ట్మెంట్లో వీళ్ళందరూ సమావేశం అయ్యారు. 13 మంది మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే చుట్టుపక్కల ఉన్న రాత్రి సమయంలో ఒకేసారి ఇంతమంది మహిళలు రావటంతో అనుమానం వ్యక్తం చేశారు.  ఆంటీల కదలికలు కూడా కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికంగా ఉన్న వ్యక్తి  పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు అపార్ట్మెంట్ పై రైడ్ చేశారు. లోపలికి వెళ్లి చూసిన పోలీసులు ఒకసారిగా షాక్ కు గురయ్యా రు. మధుర నగర్ లోని అపార్ట్మెంట్ చేరుకున్న ఆంటీలు రెండు టేబుల్స్ లో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు.

పట్టుబడిన వారిలో ఐదుగురు బిజినెస్ ఉమెన్లు..

మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక టేబుల్ లో ఏడు మంది మహిళలు ఆడుతుండగా మరో టేబుల్ లో ఐదు మంది మహిళలు టీన్ పాటీ ఆడుతున్నారు. మీరు వద్ద నుండి లక్ష రూపాయల పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 13 మంది మహిళల్లో అందరూ 50 కు పై బడి వయసు ఉన్నవారే. వీరిలో ఏడుగురు హౌస్ వైఫ్ లు కాగా, ఐదుగురు బిజినెస్ ఉమెన్ గా పోలీసులు తెలిపారు. అయితే వీరంతా కిట్టి పార్టీ పేరుతో ఇక్కడకు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళలను విచారించగా తామంతా రెండు నెలల నుండి ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు ఒప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..