PM Modi: మేరీ వాటికలో చిన్నారులను మోడీజీ మీకు తెలుసా అని అడిగిన ప్రధాని.. వీడియో వైరల్..

బాల్వతికా వీడియోను ట్విట్టర్‌లో పంచుకుంటూ ప్రధాని మోడీ కామెంట్ ను కూడా జత చేశారు.. 'అమాయక పిల్లలతో కొన్ని క్షణాలు గడిపి.. ఆనందించండి.. వారి శక్తి , ఉత్సాహం మీ మనస్సులో ఉత్సాహాన్ని నింపుతుంది. పీఎం మోడీ బాల్ వాటికలోకి రాగానే చిన్నారులంతా నమస్తే మోడీ జీ, నమస్తే మోడీ జీ అని చెప్పడం వీడియోలో కనిపిస్తోంది.

PM Modi: మేరీ వాటికలో చిన్నారులను మోడీజీ  మీకు తెలుసా అని అడిగిన ప్రధాని.. వీడియో వైరల్..
Pm Narendra Modi
Follow us

|

Updated on: Jul 30, 2023 | 7:03 AM

కొత్త జాతీయ విద్యా విధానం మూడేళ్లు అయిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అఖిల భారత విద్యా సదస్సులో పాల్గొనడానికి ముందు ఆ ప్రాంగణంలో నిర్మించిన బాల్వతిక వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ చిన్నారులతో చాలా సేపు గడిపారు. బాల్ వాటికాలో చిన్న పిల్లలతో సమావేశమైన వీడియో ఒకటి ప్రధాని మోడీ షేర్ చేశారు. ఈ వీడియోలో వాటికాలోని చిన్న పిల్లలు ప్రధాని మోడీ –మోడీ జీ అని సంతోషంగా పిలుస్తూ కనిపించారు.

బాల్వతికా వీడియోను ట్విట్టర్‌లో పంచుకుంటూ ప్రధాని మోడీ కామెంట్ ను కూడా జత చేశారు.. ‘అమాయక పిల్లలతో కొన్ని క్షణాలు గడిపి.. ఆనందించండి.. వారి శక్తి , ఉత్సాహం మీ మనస్సులో ఉత్సాహాన్ని నింపుతుంది. పీఎం మోడీ బాల్ వాటికలోకి రాగానే చిన్నారులంతా నమస్తే మోడీ జీ, నమస్తే మోడీ జీ అని చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ప్రధాని మోడీ పిల్లల వద్దకు వెళ్లి మాట్లాడారు. అంతేకాదు మోడీ జీ గురించి మీకు తెలుసా? అని పిల్లలను ప్రధాని అడిగారు.

ఇవి కూడా చదవండి

కొద్దిసేపటికే ఓ చిన్నారి మోడీ జీ మిమ్మల్ని టీవీలో చూశాం అని అంటోంది. అప్పుడు ప్రధాని మోడీ నేను టీవీలో ఏమి చేస్తున్నాను అని అడిగారు. అప్పుడు పిల్లవాడు ఇంకేదో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక నిమిషం నిడివిగల వీడియోలో పిల్లలు కూడా ప్రధాని మోడీకి పెయింటింగ్స్ వేస్తూ చూపిస్తున్నారు. మధ్యలో, ప్రధాని మోడీ కూడా పిల్లలను ప్రశ్నిస్తూ రకరకాల సమాధానాలు ఇస్తూ కనిపించారు.

వీడియో వైరల్ 

కొత్త విద్యా విధానం ప్రకారం పిల్లలను ఒకటో తరగతిలో ప్రవేశించడానికి ముందు ఒక సంవత్సరం పాటు కిండర్ గార్టెన్‌కు పంపుతున్నారు. బాలవతిక ఒక పాఠశాల లాంటిది. ఇక్కడ చిన్నారులు ఆడుతూపాడుతూ చదువుకుంటున్నారు. తద్వారా ఈ చిన్నారులు మొదటి తరగతిలో ప్రవేశం పొందినప్పుడు.. వారి మనస్సుపై పెద్దగా ఒత్తిడి ఉండదు. కిండర్ గార్టెన్‌లో చదువు కుంటూ.. ఆడుకొనేందుకు పూర్తి సదుపాయాలున్నాయి.

పాఠశాలలు లేదా అంగన్వాణి కేంద్రాల్లో కిండర్ గార్టెన్లను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించడం అని.. పిల్లలను ప్రభావవంతమైన వ్యక్తులుగా మార్చడం,  నేర్చుకోవడం పట్ల చిన్నారుల్లో ఉత్సాహాన్ని మేల్కొల్పడమని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..