Telangana Public Transport: ప్రజా రవాణాకు సడలింపులు.. సాయంత్రం 5గంటల వరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలుకు అనుమతి!

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి.

Telangana Public Transport: ప్రజా రవాణాకు సడలింపులు.. సాయంత్రం 5గంటల వరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలుకు అనుమతి!
Hyderabad Metro Rail, Rtc Buses In Telangana Resume Services
Follow us

|

Updated on: Jun 09, 2021 | 6:53 AM

Telangana Public Transport Services Resume: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను తెలంగాణ ప్రభుత్వం మరో పదిరోజులపాటు పొడగించింది. మూడో విడుత లాక్‌డౌన్‌ ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమల్లో ఉంటుందని రాష్ట్ర సర్కార్ పేర్కొంది. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. గంటలోపు ఇండ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్‌డౌన్‌ అమలవుతుంది. సడలింపు నేపథ్యంలో ప్రజా రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు కూడా సాయంత్రం వరకు రాకపోకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ప్రజా రవాణా సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది.

ప్రస్తుతం సిటీ ఆర్టీసీ బస్సులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు తిరుగుతుండగా, మరింత సడలింపు నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి. లాక్‌డౌన్‌ సడలింపు పొడగించడం వల్ల ఆర్టీసీకి మరికొంత ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్గో పార్సిల్‌ సర్వీసులు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు నడుస్తున్న మెట్రో రైళ్లు గురువారం నుంచి సాయంత్రం 5:30 వరకు నడుస్తాయి. మూడు కారిడార్లలో ఉదయం 7 గంటలకు మొదటి రైలు, సాయంత్రం 5.30 గంటలకు చివరి రైలు స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇప్పటివరకు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంది.

Read Also….  Telangana Employees PRC: ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపు.. ఈ నెల నుంచే అమలు.. 30 శాతం ఫిట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..