Huzurabad: హుజూరాబాద్‌ వాసుల పంట పండింది.. సంక్షేమ పథకాలకు భారీగా నిధులు.. 3 నెలలల్లో 4 వేల కోట్లు..!

Huzurabad Development: దళితబంధు, ఆసరా పెన్షన్లు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ భవనాలు, సీసీ రోడ్లు, వడ్డీలేని రుణాలు ఇలా హామీల జల్లులో తడిసిముద్దవుతున్నారు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు.

Huzurabad: హుజూరాబాద్‌ వాసుల పంట పండింది.. సంక్షేమ పథకాలకు భారీగా నిధులు.. 3 నెలలల్లో 4 వేల కోట్లు..!
Huzurabad Copy
Follow us

|

Updated on: Oct 11, 2021 | 6:39 PM

Huzurabad Development: మూడే మూడు నెలలు.. 4 వేల కోట్లు..! హుజురాబాద్ నియోకవర్గంపై హమీల వర్షం కురుస్తోంది. అంతే ధీటుగా నిధుల వరద పారుతోంది. దళితబంధు, ఆసరా పెన్షన్లు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ భవనాలు, సీసీ రోడ్లు, వడ్డీలేని రుణాలు ఇలా హామీల జల్లులో తడిసిముద్దవుతున్నారు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు. రాష్ట్రంలోని మరే నియోజకవర్గంలో లేనంతగా అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఎన్నేళ్లలో ఎన్నడులేనంతా అభవృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.

దళితబంధు – రూ.2,200 కోట్లు సంక్షేమభవనాలు, రోడ్లు – రూ. 800 కోట్లు అభివృద్ధి పథకాలు – రూ. 600 కోట్లు వడ్డీలేని రుణాలు – రూ. 200 కోట్లు హుజురాబాద్ మున్సిపాలిటీ – రూ. 20 కోట్లు

గడిచిన 3 నెలల్లో హుజురాబాద్ నియోకవర్గంలో వివిధ సంక్షేమ పథకాలకు చేసిన ఖర్చు ఇది. కొత్త స్కీమ్‌లు వచ్చాయి. నిలిచిపోయిన పనులకు మోక్షం కలుగుతోంది. పెండింగ్ లో ఉన్న ఆసరా పెన్షన్లు, సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీలో కదలిక వచ్చింది. సీసీ రోడ్లు, లింక్ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, సంక్షేమ భవనాలు, కుల సంఘాల భవనాలు, వడ్డీలేని రుణాలు ఇలా ఒక్కటేమిటి స్కీమ్‌లే స్కీమ్‌లు. సింపుల్‌గా చెప్పాలంటే నిధుల వరదే పారుతోందక్కడ.

మిగతా పథకాలన్నీ ఒకఎత్తు. దళితబంధు మరో ఎత్తు. సమాజంలో తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న దళితులకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక ఇది. దళితబంధుకు పైలెట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. వివిధ రకాల సర్వేల తర్వాత లబ్దిదారుల్ని ఎంపిక చేశారు. 23 వేల మందిని అర్హులుగా గుర్తించారు. ఇప్పటికే 17 వేల మంది ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమ చేశారు. నాలుగు దఫాలుగా మొత్తం రూ. 2 వేల 200 కోట్లు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

అంతేకాదు.. అటు ఆసరా పెన్షన్లకూ మోక్షం లభించింది. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పెన్షన్లు మంజూరు చేయలేదు. ఈ 3 ఏళ్లలో 57 ఏండ్లు నిండినోళ్లు, వితంతువులు, సదరం సర్టిఫికెట్ పొందిన దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూశారు. ఇలాంటి అర్హులు రాష్ట్రంలో 15 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. అయితే, 57 ఏండ్లు దాటినోళ్లంతా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 10 లక్షల మంది మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్లు పెట్టుకున్నారు. 3 నెలలుగా హుజూరాబాద్‌లో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా 10 వేల మందికి లబ్ధి చేకూరుతోంది.

ఇక, డ్వాక్రా గ్రూపులకు ఇచ్చే వడ్డీలేని రుణాల్లోనూ కదలికి వచ్చింది. ఇందుకోసం రూ. 200 కోట్లు విడుదల చేశారు. రూ. 120 కోట్లను హుజూరాబాద్‌‌లోని మహిళల సంఘాల ఖాతాల్లో జమచేశారు. ఇక కొత్త రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం జోరుగా సాగుతోంది. గల్లీల్లో సీసీ రోడ్లు నిర్మించి, మెయిన్ బజార్లలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి రూ. 30 కోట్ల చొప్పున ఐదు మండలాలకు కలిపి రూ. 150 కోట్లు కేటాయించారు. మొత్తంగా నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లింక్ రోడ్లకు రూ. 220 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

దళితబంధుతో ఇతర వర్గాల్లో కాస్త అసంతృప్తి వచ్చింది. తమను పట్టించుకోవడం లేదని ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో ఇతర కులాలపైనా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రులు హరీశ్​రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్ ఆత్మ గౌరవ సభలు నిర్వహించారు. ఆయా కుల సంఘాలకు స్థలాలు, భవనాలు మంజూరు చేశారు. హుజూరాబాద్‌లో ఈ నిధుల వరదంతా ఓట్ల కోసమేనని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఆ అవసరం తమకు లేదని అభివృద్ధే తమ ఎజెండా అని కొట్టిపారేస్తోంది ప్రభుత్వం.

Read Also… Raithu Runa Mafi: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. వచ్చే మార్చిలోపు రూ.లక్ష రుణ మాఫీః మంత్రి హరీష్ రావు

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..