AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం.. అసలు ఏం జరిగిందంటే..

పెద్దపల్లి జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రామగుండం, పెద్దపల్లిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయపడిన జనం బయటకు పరుగులు తీశారు. సీతారాంపల్లెలోనూ స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.

Earthquake: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం.. అసలు ఏం జరిగిందంటే..
Earthquake
Srinivas Chekkilla
|

Updated on: Oct 23, 2021 | 3:28 PM

Share

తెలంగాణలోని పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల సమయంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‎పై 4 తీవ్రతగా నమోదయింది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రామగుండం, పెద్దపల్లిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయపడిన జనం బయటకు పరుగులు తీశారు. సీతారాంపల్లెలోనూ స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.

మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మంచిర్యాల, రాంనగర్, నస్పూర్‌, గోసేవ మండల్ కాలనీలో భూమి కంపించింది. భూమి కదలికలు గుర్తించిన జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పెరుగెత్తారు. దాదాపు రెండు సెకండ్లపాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also.. Huzurabad By Election: రేవంత్‌రెడ్డిని కలిసింది వాస్తవమే.. కానీ ఇప్పుడు కలవలేదు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..