AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీనేజ్‌ జంట క్షణికావేశం.. కన్నోళ్లు తమ ప్రేమను అంగీకరించరేమోనని దారుణం!

సినిమాల ప్రభావమో.. సోషల్ మీడియా ఆకర్షణో తెలియదు గానీ పిల్లలు మొదలు పెద్దల వరకు అంతా ఓ రకమైన ట్రాన్స్‌లో పడిపోతున్నారు. తన కంటే చిన్న వయసున్న అబ్బాయిని ప్రేమించిందో అమ్మాయి. అతడూ ఆమెను ప్రేమించాడు. అయితే వీరి ప్రేమకు వయసు అడ్డంకిగా మారింది. అబ్బాయి అమ్మాయి కంటే చిన్నవాడు. పైగా టీనేజ్‌.. అంతే పెద్దలు వీరి ప్రేమను ఒప్పుకోరనీ..

టీనేజ్‌ జంట క్షణికావేశం.. కన్నోళ్లు తమ ప్రేమను అంగీకరించరేమోనని దారుణం!
Couple Commits Suicide
Srilakshmi C
|

Updated on: Mar 17, 2025 | 10:39 AM

Share

హుజూరాబాద్‌, మార్చి 17: ఆ ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు తెలిపి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. కానీ ఇంతలో తమ ఇళ్లలోని పెద్దలు తమ ప్రేమను అంగీకరించేమోనని అనుమానపడి భయపడ్డారు. అంతే కన్నోళ్లకు తమ ప్రేమను తెలుపకుండానే క్షణికావేశంతో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. కలసి బతకలేనప్పుడు కలిసి చావునైనా పంచుకుందామని ఇద్దరూ రైలు కింద పడి మృతిచెందారు. దీంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. ఈ దారుణ ఘటన జమ్మికుంట మండలంలో వెలుగు చూసుంది.

ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్‌ (18) ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం ఎర్రచింతల్‌ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత (20) కరీంనగర్‌లోని ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి ఇన్‌స్టాగ్రామ్‌లో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అంతే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ల ఇద్దరూ ఈ విషయం ఇంట్లో తెలియజేసి వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే రాహుల్‌.. శ్వేత కంటే చిన్నవాడు. దీంతో పెద్దలు తమ ప్రేమను అంగీకరించరనే భయంతో క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో శ్వేత రాహుల్‌తో కలిసి జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ వెళ్లారు. అక్కడ కొంత సేపు ఆలోచించి ఏ నిర్ణయానికి వచ్చారో తెలియదుగానీ వెంటనే జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ రైల్వేస్టేషన్‌-పాపయ్యపల్లె గేట్‌ వద్దకు చేరుకున్నారు.

అక్కడ శనివారం రాత్రి ఇద్దరూ గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన లోకో పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణమని రైల్వే పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి