AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గంటన్నర పాటు ఫైట్‌లోనే!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసరంగా ల్యాండ్ చేశారు. రేవంత్ రెడ్డి విమానం టేకాప్ అయ్యాక ఎమర్జెన్సీ లాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గంటన్నర పాటు ఫైట్‌లోనే!
Cm Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Mar 17, 2024 | 4:34 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసరంగా ల్యాండ్ చేశారు. రేవంత్ రెడ్డి విమానం టేకాప్ అయ్యాక ఎమర్జెన్సీ లాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇదే విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షి శంషాబాద్‌ విమానాశ్రయంలో చిక్కకుపోయారు.

మధ్యాహ్నం 2.30గంటకు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఫ్లైట్ నంబర్ 6e 5099 ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే మళ్లీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు పైలట్. వెంటనే అక్కడికి చేరుకున్న టెక్నికల్ టీమ్ ఇంజిన్ ఐసీయులో సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఇంజన్ వేడెక్కడంతో ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో గంట నుంచి రేవంత్‌, భట్టి, టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షి విమానంలోనే ఉండిపోయారు. రిపేర్ అనంతరం మళ్లీ టేకప్ అయిన విమానం ముంబైకి వెళ్ళిపోయింది.

ముంబైలో జరిగే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు, భట్టి, పొన్నం, దీపాదాస్‌ మున్షి పలువురు ముఖ్యనేతలు ఇండిగో విమానంలో బయలుదేరారు. ఈ విమానంలో మొదటి రో లో A2 సీటులో సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి ముంబైకు మధ్యాహ్నం 2.30 గంటలకు టికెట్స్‌ బుక్‌ చేసుకున్నారు. తీరా వీరు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో టెక్నికల్ సమస్య కారణంగా గంటన్నర ఆలస్యం అయ్యింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా విమానంలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. అనంతరం సాంకేతిక సమస్యలను పునరుద్దరించడంతో ముంబై బయల్దేరినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?