AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఏం చెప్పారంటే

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. అడవుల పెంపకం కోసం ” కాంపెన్ సేటరి అఫారెస్టేషన్ ఫండ్” క్రింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగ పరుచుకోవడం లేదని లేఖ రాశారు.

Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఏం చెప్పారంటే
Kishan Reddy
Aravind B
|

Updated on: Apr 18, 2023 | 7:25 AM

Share

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. అడవుల పెంపకం కోసం ” కాంపెన్ సేటరి అఫారెస్టేషన్ ఫండ్” క్రింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగ పరుచుకోవడం లేదని లేఖ రాశారు. అలాగే వన్యప్రాణుల సంరక్షణలో కేంద్ర ప్రభుత్వ ప్రయోజత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన నిధుల గురించి ఆ లేఖలో తెలియజేశారు. మానవ అవసరాల కోసం చేపడుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల వల్ల కొంత అటవీ విస్తీర్ణాన్ని కోల్పోవలసి వస్తుందని..దీంతో ఈ అడవుల మీద ఆధారపడి ఉన్న ఎన్నో రకాల ప్రాణులకు ఇబ్బంది కలగడమేకాకుండా, ప్రాకృతిక విపత్తులు సంభవించటానికి కూడా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల వలన కోల్పోయిన అటవీ విస్తీర్ణాన్ని ప్రత్యామ్నాయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.అందులో భాగంగానే “కాంపెన్ సేటరీ అఫారెస్టేషన్ ఫండ్” ను ఏర్పాటు చేసిందన్నారు.

అడవుల పెంపకం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వార్షిక ప్రణాళికలకు ఆమోదం తెలిపి, CAMPA ఫండ్ క్రింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. అందులో భాగంగా తెలంగాణకి రూ.3,110 కోట్ల నిధులను 2019-20 సంవత్సరంలో విడుదల చేసిందని తెలిపారు. అయితే గత 3 ఏళ్లుగా గణాంకాలను పరిశీలిస్తే, ఆ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేకపోతున్న విషయం స్పష్టమవుతుందన్నారు. వినియోగానికి ఆమోదం పొందిన నిధుల విలువకు, వినియోగించుకున్న నిధుల విలువకు దాదాపు 610 కోట్ల వ్యత్యాసం ఉందని ఆరోపించారు. అయితే మరోవైపు అడవుల సంరక్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్