AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎమ్మెల్యేల ప్రలోభాలపై ఎవరి వెర్షన్ వారిదే.. తమకు సంబంధం లేదంటున్న బీజేపీ, కమలం కుట్ర అంటున్న టీఆర్ ఎస్..

హైదరాబాద్ శివారులో ఓ గెస్ట్ హౌస్ లో ముగ్గురు వ్యక్తులు, నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓ జాతీయ పార్టీ భేరసారాలు ఆడిందని టీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో టీఆర్ ఎస్, బీజేపీ వైఖరి భిన్నంగా ఉన్నాయి. ఇదంతా టీఆర్ ఎస్ డ్రామా అని..

Telangana: ఎమ్మెల్యేల ప్రలోభాలపై ఎవరి వెర్షన్ వారిదే.. తమకు సంబంధం లేదంటున్న బీజేపీ, కమలం కుట్ర అంటున్న టీఆర్ ఎస్..
Kishan Reddy
Amarnadh Daneti
|

Updated on: Oct 26, 2022 | 10:20 PM

Share

హైదరాబాద్ శివారులో ఓ గెస్ట్ హౌస్ లో ముగ్గురు వ్యక్తులు, నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓ జాతీయ పార్టీ భేరసారాలు ఆడిందని టీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో టీఆర్ ఎస్, బీజేపీ వైఖరి భిన్నంగా ఉన్నాయి. ఇదంతా టీఆర్ ఎస్ డ్రామా అని బీజేపీ అంటుంటే, కమలం పార్టీ కుట్ర అని టీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఓ గెస్ట్ వాస్ లో ఇద్దరు స్వామీజీలతో పాటు ఒక బిజినెస్ మ్యాన్, నలుగురు ఎమ్మెల్యేలు సమావేశమవ్వడం కెమెరాల ముదు అందరికీ కనిపించింది. అయితే ఈ విషయంలో ఎవరి వెర్షన్స్‌ వాళ్లు చెబుతున్నారు. అక్కడ సీన్‌లో దొరికింది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాబట్టి.. సహజంగా బీజేపీపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్‌ఎస్ వాళ్లు చెబుతోంది కూడా అదే. బీజేపీ నాయకులే కొనుగోళ్లకు తెరలేపిందన్నది టీఆర్ ఎస్ పార్టీ నేతల ఆరోపణ. వందలకోట్లతో తమ పార్టీ వాళ్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని, కానీ, తమవాళ్లు అమ్ముడుపోకుండా బీజేపీ కుట్రలను బయటపెట్టారని చెప్పుకుంటోంది టీఆర్ఎస్‌. ఇక ఇదే అంశాన్ని బీజేపీ టీఆర్‌ఎస్‌ డ్రాగాగా చెబుతోంది.

ముందునుంచీ బీజేపీ కొనుగోళ్లు జరుపుతుందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దాన్ని నిజం అని చెప్పేలే ఓ డ్రామా క్రియేట్ చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా గులాబీ పార్టీదే అని ప్రతివిమర్శలు చేస్తున్నారు. మధ్యవర్తులుగా వచ్చిన వ్యక్తుల్లో ఓ పర్సన్ నందు. అతను కిషన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది. అయితే మధ్యవర్తులుగా వచ్చిన వ్యక్తులు ఎవరో, ఎందుకొచ్చారో కూడా తెలీదంటున్నారు కిషన్ రెడ్డి. తాను ఎమ్మెల్యేగా ఉన్న టైమ్‌లో ఎవరో, ఎవరెవరో ఫోటోలు దిగారని.. వాటిని ప్రయోగించి నిందలు బీజేపీపై వెయ్యొద్దంటున్నారు. ఎమ్మెల్యేల ప్రలోభాలు జరిగాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది.

పోలీసులు కూడా భేరసారాలు జరుగుతున్నాయన్న సమాచారం తమకు వచ్చిందని, దీంతో తాము దాడులు చేశామంటున్నారు పోలీసులు. అసలు ఏం జరిగిందంనేది తేల్చాల్సింది మాత్రం పోలీసులే. మనుషుల్ని పట్టుకున్నారు. మధ్యవర్తులను పట్టుకున్నారు. ప్రలోభాలు జరుగుతున్నాయన్న సమాచారంతో వచ్చి దాన్ని నిర్దారించామని, మిగతా విషయాలన్నీ దర్యాప్తు తర్వాత చెబుతామని అంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

Follow Us
ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ లీడర్స్ వీరే
ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ లీడర్స్ వీరే
ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా? కేవలం వడ్డీ ద్వారానే రూ.5 లక్షలు
ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా? కేవలం వడ్డీ ద్వారానే రూ.5 లక్షలు
నిమ్మకాయ నీళ్లు తాగితే గుట్టలాంటి పొట్ట నిజంగా తగ్గుతుందా..?
నిమ్మకాయ నీళ్లు తాగితే గుట్టలాంటి పొట్ట నిజంగా తగ్గుతుందా..?
ఈ సిలిండర్ వెనక్కి ఇచ్చేస్తే రూ.500 రీఫండ్
ఈ సిలిండర్ వెనక్కి ఇచ్చేస్తే రూ.500 రీఫండ్
వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్‌ నగరం.. 21 మంది మృతి
వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్‌ నగరం.. 21 మంది మృతి
అతను ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
అతను ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. ఎప్పుడు ప్రారంభం?
బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. ఎప్పుడు ప్రారంభం?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది?
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్