Amith Shah: ఢిల్లీకి చేరిన సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారం.. రంగంలోకి కేంద్ర హోం మంత్రి అమిత్​షా..

Amith Shah call: ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహరం తెలంగాణ వ్యాప్తంగా ఎంతటి అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ అంశం ఢిల్లీకి చేరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు..

Amith Shah: ఢిల్లీకి చేరిన సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారం.. రంగంలోకి కేంద్ర హోం మంత్రి అమిత్​షా..
Amith Shah
Follow us

|

Updated on: Apr 19, 2022 | 3:57 PM

Amith Shah: ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహరం తెలంగాణ వ్యాప్తంగా ఎంతటి అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అక్రమంగా 16 కేసులు నమోదు చేయించారంటూ, ఆ వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు సాయి గణేష్‌ చెప్పిన మాటలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సాయి గణేష్‌ ఏప్రిల్‌ 14న చికిత్స పొందుతూ మరణించారు. దీంతో బీజేపీ ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకొని టీఆర్‌ఎస్‌పై ఒత్తిడి పెంచుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అంశం ఏకంగా ఢిల్లీకి చేరింది. సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారమై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మంగళవారం ఫోన్‌ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మంగళవారం బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి సాయి గణేష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగానే సాయి గణేష్‌ ఆత్మహత్య విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లడంతో.. వెంటనే స్పందించిన అమిత్‌ షా సాయి గణేష్‌ కుటుంబ సభ్యులను ఫోన్‌లో మాట్లాడించారు.

ఇదిలా ఉంటే మరణానికి ముందు తన ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కారణమంటూ సాయి గణేష్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సాయి గణేష్ మీడియాకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మంత్రి ఫ్లెక్సీలను చింపేసి ఆందోళనలు చెప్పటి విషయం తెలిసిందే.

Also Read: AP 10th class Hall Tickets 2022: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Viral Video: ఇజ్జత్ పోతుందని సైలెంట్‌‌గా సైడ్‌ కి వెళ్లిన పిల్లి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

Infosys shares: రూ. 40వేల కోట్లు కోల్పోయిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లు.. షేర్లను ఉంచుకోవచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే..

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు