AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దేశ రక్షణకు వెళ్లి ఊపిరి వదిలిన తెలంగాణ బిడ్డ.. అనుమానాస్పద స్థితిలో మృతి..!

దేశ రక్షణ కోసం గుజరాత్ వెళ్లిన తెలంగాణ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బల్ల గంగా భవాని నాలుగు సంవత్సరాల క్రితం బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్‌గా చేరింది.

Telangana: దేశ రక్షణకు వెళ్లి ఊపిరి వదిలిన తెలంగాణ బిడ్డ.. అనుమానాస్పద స్థితిలో మృతి..!
Bsf Jawan Ganga Bhavani
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 08, 2024 | 2:30 PM

Share

దేశ రక్షణ కోసం గుజరాత్ వెళ్లిన తెలంగాణ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బల్ల గంగా భవాని నాలుగు సంవత్సరాల క్రితం బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్‌గా చేరింది. డ్యూటీలో చేరినప్పటి నుండి చురుక్కు ఉండే గంగా భవాని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించింది. కలివిడిగా ఉండే గంగా భవాని మృతితో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది.

నార్త్ బెంగాల్లో విధులు నిర్వహించిన గంగాభవాని ఎనిమిది నెలల క్రితం గుజరాత్‌కు బదిలీపై వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్ గా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన గంగా భవాని సెప్టెంబర్ 1వ తేదీన విధులకు హాజరయ్యేందుకు తిరిగి వెళ్ళింది. గుజరాత్ బోర్డర్‌లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో విశ్రాంతి కోసం శనివారం(సెప్టెంబర్ 7) రాత్రి గాంధీనగర్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌కు వచ్చిన గంగాభవాని అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

అయితే గంగాభవాని మృతి చెందిన విషయాన్ని ఆదివారం ఉదయం తెలుసుకున్న అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. గంగా భవానీ మృతికి గల కారణాలు తెలియ రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు కుటుంబసభ్యులు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే గంగాభవాని మృతికి గల కారణాలు తెలుస్తాయని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. గంగా భవాని మృతదేహాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు మృతదేహం గోదావరిఖనిలోని తన సొంత ఇంటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశానికి సేవ చేయాలని రాష్ట్రాన్ని వీడి వెళ్లిన గంగాభవాని, కానరాని లోకాలకు తరలి వెళ్లడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఈ ఉదంతం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..