AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dogs Attack: భాగ్యనగరంలో మరోసారి కుక్కల బీభత్సం.. బాలుడు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగిపై వీధి కుక్కల దాడి.. తప్పిన ప్రాణాపాయం

రెండేళ్ల బాబు అక్కడే ఆడుకుంటుండగా దాదాపు పదిపన్నెండు వీధి కుక్కలు పిల్లాడిపై హఠాత్తుగా ఎటాక్‌ చేశాయి. దీంతో హడలిపోయిన మూడేళ్ళ పసివాడు ఏడుపులంకించుకున్నాడు.

Dogs Attack: భాగ్యనగరంలో మరోసారి కుక్కల బీభత్సం.. బాలుడు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగిపై వీధి కుక్కల దాడి.. తప్పిన ప్రాణాపాయం
Dog Control
Surya Kala
|

Updated on: Mar 10, 2023 | 6:34 AM

Share

నిన్నగాక మొన్న ప్రదీప్‌ని పొట్టనపెట్టుకున్న కుక్కలు… గత కొద్దిరోజులుగా నగరంలో భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఒక్క రోజే రెండో చోట్ల కుక్కలు జనంపై ఎటాక్‌ చేశాయి. కుక్కల వరుస దాడులకు పసిపిల్లలు బలౌతోన్న స్థితి తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. కుక్కల దాడులతో పసిబిడ్డలు బెంబేలెత్తిపోతున్నారు.

తాజాగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మరోసారి వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. అత్తాపూర్ డివిజన్ తేజస్వి నగర్ కాలనీలో సన్‌రైజ్‌ టవర్స్ దగ్గర ఓ మూడేళ్ళ చిన్నారిని వదిలి…పిల్లాడి తల్లీతండ్రీ కూలి పనిలోకి వెళ్ళారు. రెండేళ్ల బాబు అక్కడే ఆడుకుంటుండగా దాదాపు పదిపన్నెండు వీధి కుక్కలు పిల్లాడిపై హఠాత్తుగా ఎటాక్‌ చేశాయి. దీంతో హడలిపోయిన మూడేళ్ళ పసివాడు ఏడుపులంకించుకున్నాడు. కుక్కలు బాలుడిని తరుముకుంటూ వెంబడించాయి. పిల్లవాడి ఏడుపు విన్న స్థానికులు పరిగెత్తుకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కుక్కలను తరిమేసి, బాలుడిని కాపాడారు స్థానికులు.

మరోవైపు మేడ్చల్ జిల్లా… పీర్జాది గూడ, బుద్దా నగర్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి భూపాల్ రెడ్డిపై కుక్కలు ఎటాక్‌ చేశాయి. ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తుండగా వీధి కుక్కలు దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గతంలో కూడా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తరువాత మర్చిపోతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,..