AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మాజీమంత్రి మల్లా రెడ్డికి షాక్.. రెవెన్యూ సర్వేలో వెలుగులోకి కీలక విషయాలు..

మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూ కొలిక్కి వచ్చింది. సుచిత్రలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్‌ని సర్వేచేసిన అధికారులు మల్లారెడ్డిది కాదని తేల్చారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న 33 గుంటల స్థలం మల్లారెడ్డి కాదని రెవిన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరుకు హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్టును పంపించారు. దశాబ్ద కాలంగా అది తన భూమి అని చెప్పుకుంటున్నారు మల్లారెడ్డి.

Telangana: మాజీమంత్రి మల్లా రెడ్డికి షాక్.. రెవెన్యూ సర్వేలో వెలుగులోకి కీలక విషయాలు..
Malla Reddy
Srikar T
|

Updated on: Jun 13, 2024 | 8:55 AM

Share

మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూ కొలిక్కి వచ్చింది. సుచిత్రలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్‌ని సర్వేచేసిన అధికారులు మల్లారెడ్డిది కాదని తేల్చారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న 33 గుంటల స్థలం మల్లారెడ్డి కాదని రెవిన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరుకు హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్టును పంపించారు. దశాబ్ద కాలంగా అది తన భూమి అని చెప్పుకుంటున్నారు మల్లారెడ్డి. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని పదిహేను మంది వ్యక్తులు ఫెన్సింగ్ వేసుకున్నారు. సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ పై 15 మంది బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫెన్సింగ్‌ను మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో వచ్చి మే 19వ తేదీన తొలగించారు.

ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడిని పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు పోలీసులు. ఈ భూ వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా ఉన్నారు. భూమి తమదే అంటున్న పదిహేను మందిలో ఆయన కూడా ఒకరు. గతంలోనే సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదని.. తనకు సర్వే అవసరంలేదని చెప్పారని ఆయన ఆరోపించారు. అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పినా . కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారని ఆరోపించారు అడ్లూరి లక్ష్మణ్. వివాదం తర్వాత ప్రభుత్వం ఆ స్థలంలో సర్వేకు ఆదేశించింది. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిల సమక్షంలోనే సర్వే చేశారు. సర్వే చేపట్టిన రెవిన్యూ అధికారులు.. ఆ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు తేల్చారు. దీంతో ల్యాండ్ పై ఉన్న మరో వర్గం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు. అయితే భూమి తనది కాదని తేలడంతో ఇప్పుడు మల్లారెడ్డి స్టెప్‌ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Follow Us
రోజురోజుకు పెరుగుతున్న మహా శివలింగం.. 2000 ఏళ్ల మిస్టరీ ఇదే..!
రోజురోజుకు పెరుగుతున్న మహా శివలింగం.. 2000 ఏళ్ల మిస్టరీ ఇదే..!
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌
సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌
ఈ రైలుకు ఎందుకంత క్రేజ్‌.. నంబర్‌ 1 స్థానంలో.. కీలక విషయాలు!
ఈ రైలుకు ఎందుకంత క్రేజ్‌.. నంబర్‌ 1 స్థానంలో.. కీలక విషయాలు!
ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?
ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..