AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లోన్ కట్టాలని వేధించిన అధికారులు.. పురుగుల మందు తాగి బ్యాంకులోనే రైతు ఆత్మహత్య

విషాద ఘటన. అన్నం పెట్టే రైతు ఆర్తనాదం ఇది. బ్యాంకు సిబ్బంది వేధింపులకు ఓ రైతు బలయ్యాడు. అప్పు తీసుకున్న బ్యాంకులోనే అందరూ చూస్తుండగానే పురుగుల‌మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Telangana: లోన్ కట్టాలని వేధించిన అధికారులు.. పురుగుల మందు తాగి బ్యాంకులోనే రైతు ఆత్మహత్య
Farmer Dies In Bank
Naresh Gollana
| Edited By: |

Updated on: Jan 18, 2025 | 8:16 PM

Share

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు ఆదిలాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో 2019 లో భూమిని కుదువ పెట్టి 3.50 లక్షల రుణం తీసుకున్నాడు. ఏడాదికి కొంత వడ్డీని కడుతూ వస్తున్నాడు. గత ఏడాది కాలంగా పంటలు సరిగా పండక వడ్డీ కట్టలేకపోయాడు. వడ్డీని చెల్లించలేని లేని పక్షంలో భూమిని జప్తు చేసుకుంటామంటూ బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో తనకు ఇన్నాళ్లు అన్నం పెట్టిన భూమి పోతుందని మనోవేదనకు గురైన రైతు దేవరావు పురుగుల మందు డబ్బాతో బ్యాంకుకు వచ్చి అందరూ చూస్తుండగానే క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.

గమనించిన సెక్యూరిటీ గార్డ్ రైతును పక్కనే ఉన్న కుర్చిలో కూర్చోబెట్టి బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. అంతలోనే రైతు తీవ్ర అస్వస్థకు గురై అక్కడికక్కడే కూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు బ్యాంకు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పెద్ద పెద్ద బడా బాబులు బ్యాంకు లోన్లు తీసుకుని విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటే.. ఏం చేయలేని అధికారులు.. ఇలా చిన్న, సన్నకారు రైతులను వేధింపులకు గురిచేయడంపై పలవురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుల బాధతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు

ఖమ్మం – సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారులోని చెరువులో దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.  ఆర్థిక ఇబ్బందులతో చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మృతులు కృష్ణ(60),సీత(55)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి