AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..

పోలీసుల కథనం ప్రకారం.. కొనిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన 26 ఏళ్ల దూరి అనూష ఖమ్మంలోని ఓ ప్రైవేట్ మాల్‌లో చిరుద్యోగిగా పనిచేస్తుంది. ప్రతీరోజు కొణిజర్ల నుంచి ఖమ్మం ఆర్టీసీ బస్సులో వెళ్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా శనివారం కూడా కొనిజర్లలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే అదే సమయంలో బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు...

Telangana: ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
Representative Image
Narender Vaitla
|

Updated on: May 19, 2024 | 6:36 AM

Share

తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రయాణికుల రద్దీ.? డ్రైవర్‌ నిర్లక్ష్యం.? కారణం ఏదో కానీ.. ఇద్దరు బిడ్డలకు తల్లిని లేకుండా చేసింది. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. కొనిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన 26 ఏళ్ల దూరి అనూష ఖమ్మంలోని ఓ ప్రైవేట్ మాల్‌లో చిరుద్యోగిగా పనిచేస్తుంది. ప్రతీరోజు కొణిజర్ల నుంచి ఖమ్మం ఆర్టీసీ బస్సులో వెళ్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా శనివారం కూడా కొనిజర్లలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే అదే సమయంలో బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. కనీసం బస్సు లోపలికి కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫుట్‌బోర్డ్‌పైనే నిల్చుంది అనూష.

ఈ క్రమంలోనే బస్సు ప్రయాణం మొదలైంది. అయితే బస్సు కొంత దూరం వెళ్లగానే ముందు వెళ్లే మరో బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలోనే డ్రైవర్‌ వేగంగా బస్సును మూవ్ చేశాడు. దీంతో ఫుట్‌బోర్డ్‌పై ఉన్న అనూష అదుపు తప్పి బస్సు నుంచి కింద పడ్డారు. దీంతో వెనక టైరు ఆమె శరీరం పైనుంచి వెళ్లడంతో అనూష అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కళ్లెదుటో జరిగిన దారుణ సంఘటన చూసిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

విషయం తెలుసుకున్న ఎస్సై శంకరరావు, ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అనూష భర్త అశోక్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనూషకు ఆరేళ్ల లోపు ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే