AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధాని ఏసీ బస్సులో మంటలు.. క్షణాల్లో దగ్దం..పక్కనే పెట్రోల్ బంకు..

డిపోలోని బంకు వద్ద బస్సును నిలిపివేసిన డ్రైవర్ బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత బంకు సిబ్బంది డిజిల్ ఫిల్ చేసిన కొద్ది సేపటికి అకస్మాత్తుగా బస్సులోపల నుండి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది ఫైర్ ఇంజన్ ను రప్పించి మంటలు ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పింది.

రాజధాని ఏసీ బస్సులో మంటలు.. క్షణాల్లో దగ్దం..పక్కనే పెట్రోల్ బంకు..
Tsrtc Rajdhanis Ac Bus
G Sampath Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 08, 2023 | 2:14 PM

Share

జగిత్యాల, అక్టోబర్‌08; జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్సు డిపోలో ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు రాజధాని ఏసీ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్డం అయింది. హైదరాబాద్ నుండి జగిత్యాలకు ప్రయాణీకులను తరలించిన తరువాత డిజిల్ కోసం డిపోకు బస్సును తీసుకెళ్లారు. డిపోలోని బంకు వద్ద బస్సును నిలిపివేసిన డ్రైవర్ బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత బంకు సిబ్బంది డిజిల్ ఫిల్ చేసిన కొద్ది సేపటికి అకస్మాత్తుగా బస్సులోపల నుండి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది ఫైర్ ఇంజన్ ను రప్పించి మంటలు ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పింది.

లేనట్టయితే బస్సులోని మంటలు మరింత వ్యాపించినట్టయితే డిపో మొత్తం దగ్దం కావడంతో పాటు బంకు కూడా మంటల్లో చిక్కుకుని పోయేది. దీంతో కోరుట్ల పట్టణంలో భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేది. ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన వెంటనే యంత్రాంగం రంగంలోకి దిగి ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పడంతో ఒక్క బస్సు మాత్రమే దగ్దం అయింది.

ఆర్టీసీ అధికారులు హఠాత్తుగా బస్సు ఎలా దగ్దం అయింది అన్న విషయంపై ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారని సమాచారం.. బంకు వరకు మంటలు వ్యాపించాయి.. పొగ తో నిండిపోయింది బంకు.. స్పీడ్ గా.. మంటలు ఆర్పడం తో.. ప్రమాదం నుంచి బయటపడ్డారు కోరుట్ల వాసులు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..