Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagpur: పురుషుడికి గర్భం.. ఆపరేషన్‌ సమయంలో గుర్తించిన వైద్యులు షాక్..!

స్త్రీలు గర్భవతి అవడం కామన్. మరి పురుషులు గర్భం దాల్చడం.. వినేందుకే విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అది జరగని పని కాబట్టి. కానీ, ఇక్కడ అదే జరిగింది. ఓ వ్యక్తికి గర్భం వచ్చింది. అయితే, ఆ గర్భాన్ని గుర్తించడానికి 36 ఏళ్లు పట్టింది.

Nagpur: పురుషుడికి గర్భం.. ఆపరేషన్‌ సమయంలో గుర్తించిన వైద్యులు షాక్..!
Male Pregnant
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 24, 2023 | 8:45 AM

స్త్రీలు గర్భవతి అవడం కామన్. మరి పురుషులు గర్భం దాల్చడం.. వినేందుకే విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అది జరగని పని కాబట్టి. కానీ, ఇక్కడ అదే జరిగింది. ఓ వ్యక్తికి గర్భం వచ్చింది. అయితే, ఆ గర్భాన్ని గుర్తించడానికి 36 ఏళ్లు పట్టింది. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎలా వెలుగు చూసింది? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ అరుదైన ఘటన 1999 నాటిది. అయితే, తాజాగా ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రచురించడంతో వెలుగులోకి వచ్చింది. నాగపూర్‌కు చెందిన సంజూ అనే వ్యక్తికి పొట్ట పెరుగుతూ వచ్చింది. 36 ఏళ్లుగా తన పొట్టు పెరుగుతోందని, దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతన్ని పరీక్షించి, స్కానింగ్ చేయించారు. కడుపులో గడ్డ ఉందని, దానిని క్యాన్సర్ గడ్డ అని భావించారు వైద్యులు. ఈ మేరకు సర్జరీకి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, సర్జరీ సమయంలో కనిపించిన గడ్డను చూసి విస్తుపోయారు వైద్యులు. ఎందుకంటే.. అది క్యాన్సర్ గడ్డ కాదు. క్రమంగా పెరుగుతూ వస్తున్న గర్భం. ఆ గర్భాన్ని చూసి వైద్యులు షాక్ అయ్యారు. ఆపరేషన్ చేసి ఆ పిండాన్ని తొలగించారు. అయితే, ఈ పిండం అతని కవల సోదరుడిది అని, ఆయనలో ఉండిపోయిందని వైద్యులు వివరణ ఇచ్చారు. అలా 36 ఏళ్ల పాటు సంజూ కడుపులోనూ పిండం పెరుగుతూ వచ్చిందని పేర్కొన్నారు. దీనిని అత్యంత అరుదైన పీటస్ ఇన్ ఫీటుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలను తాజాగా ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది. దాంతో మ్యాటర్ సమాజానికి తెలిసింది.

మరిన్ని సైన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..