Wimbledon 2022: సానియా జోడీ సంచలనం.. సెమిస్లో అడుగు.. కెరీర్ స్లామ్కి మరో అడుగు దూరంలో హైదరాబాదీ
సోమవారం అర్ధరాత్రి ఒక గంట 41 నిమిషాల పాటు జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సానియా-పావిచ్ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రియెల డాబ్రోస్కీ(కెనడా)-జాన్ పీర్స్(ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది.
Wimbledon 2022: సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్.. హైదరాబాదీ అమ్మాయి సానియా మీర్జా సంచలన విజయాన్ని అందుకుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్తో కలిసి సానియా మీర్జా సెమీఫైనల్లో చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి ఒక గంట 41 నిమిషాల పాటు జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సానియా-పావిచ్ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రియెల డాబ్రోస్కీ(కెనడా)-జాన్ పీర్స్(ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్లు సంధించింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో మిక్స్డ్ డబుల్స్లో సానియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
గతంలో 2011, 2013, 2015లో క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. ఈ విజయం మిక్స్డ్ డబుల్స్లో కెరీర్ స్లామ్కి మరో అడుగు చేరువైంది. సానియా, మహేష్ భూపతితో కలిసి 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ , 2012 ఫ్రెంచ్ ఓపెన్లలో మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది, దీనికి ముందు బ్రెజిల్కు చెందిన బ్రూనో సోరెస్తో కలిసి 2014 US ఓపెన్లో చేరింది.
ఈ సీజన్ ముగిసే సమయానికి రిటైర్మెంట్ ప్రకటించిన సానియా.. ఆమె చెక్ భాగస్వామి లూసీ హ్రడెకా అంతకుముందు మహిళల డబుల్స్ ఈవెంట్ ప్రారంభ రౌండ్లో ఓడిపోయారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..