AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Singh: హీరో కాస్తా విలన్‌ అయ్యాడు.. యువరాజ్‌ సింగ్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎందుకంటే?

యువరాజ్ సింగ్.. క్రికెట్ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. దేశం కోసం క్యాన్సర్‌తోనే మైదానంలోకి దిగాడీ లెజెండరీ క్రికెటర్. తన ఆటతీరుతో టీమిండియాకు రెండు ప్రపంచకప్ లు అందించాడు.

Yuvraj Singh: హీరో కాస్తా విలన్‌ అయ్యాడు.. యువరాజ్‌ సింగ్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎందుకంటే?
Yuvraj Singh
Basha Shek
|

Updated on: Dec 12, 2024 | 5:02 PM

Share

భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గురువారం (డిసెంబర్ 12) తన 43వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు యూవీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. 2000 సంవత్సరంలో భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువీ, 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు ప్రపంచకప్‌లలో యువీ బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో యువీ పరుగుల సునామీ సృష్టించాడు. అయితే ఇది జరిగిన కేవలం 3 ఏళ్ల తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్‌లో యువీ స్లో బ్యాటింగ్ కారణంగా జట్టు ఓటమికి కారణమయ్యాడు. దీంతో క్రికెట్ అభిమానులు అతని ఇంటిపై రాళ్లు రువ్వారు. నిజానికి యువరాజ్ సింగ్ క్రికెట్ ప్రపంచ క్రికెట్ లో సిక్సర్ల కింగ్ అని పిలుస్తారు. ఒకే ఓవర్ లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఘనత కూడా అందిం. అయితే ఏప్రిల్ 6, 2014 రాత్రి బహుశా యువరాజ్ సింగ్ కెరీర్‌లో అత్యంత చెత్త రోజు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ రోజు మిర్పూర్ మైదానంలో భారత్-శ్రీలంక మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇదే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా అభిమానులకు టార్గెట్‌గా మారాడు.

టీ20 ఫార్మాట్‌లో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపిస్తున్న యువరాజ్ సింగ్.. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21 బంతులు మాత్రమే ఆడి 52.38 స్ట్రైక్ రేట్‌తో 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో యువీ 11వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చి ఎట్టకేలకు 19వ ఓవర్‌ వరకు క్రీజులో ఉన్నాడు. 21 బంతులు ఎదుర్కొన్న యువీ అందులో 9 డాట్ బాల్స్ ఆడాడు. ఆ తర్వాత 19వ ఓవర్లో ఔటయ్యాడు. అయితే ఇంత సేపు బ్యాటింగ్ చేసినా యువీ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. యువరాజ్ స్లో బ్యాటింగ్ ఫలితంగా టీమిండియా 20 ఓవర్లలో కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంక 13 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా భారత్ కు టీ20 ప్రపంచకప్‌ దూరమైంది.

21 బంతుల్లో 11 రన్స్..

మిర్పూర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓడిపోవడంతో భారత అభిమానులు కోపోద్రిక్తులయ్యారు. ముఖ్యంగా యువరాజ్ ను టార్గెట్ గా చేసుకున్నారు. చండీగఢ్‌లోని అతని ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. దీనిపై ఆ తర్వాత స్పందించిన యూవీ.. ‘ఈ ఓటమికి నేనే బాధ్యుడిని. ఆ రోజు చాలా పేలవంగా ఆడాను. ఒకటి రెండు ఓవర్లలో చాలా డాట్ బాల్స్ ఆడాను. ఆ రోజు మలింగ బాగా బౌలింగ్ చేశాడు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా అతడిని సరిగ్గా ఆడలేకపోయారు. నేను పేలవంగా ఆడానని నేనే ఒప్పుకుంటాను. దురదృష్టవశాత్తు అది టీ20 ప్రపంచకప్ ఫైనల్. మరే మ్యాచ్‌లోనూ జరిగి ఉంటే ఇలా జరిగేది కాదు. దీంతో చాలా మంది నాతో మాట్లాడడం మానేశారు. ఎయిర్‌పోర్టులో మీడియా నాపై అరిచింది. నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఆ రోజు ఇంటికి చేరుకున్నాక, నేను 6 సిక్సర్లు కొట్టిన నా బ్యాట్ వైపు చూస్తున్నాను. నేను దానిపై నా ఇండియా క్యాప్‌ని కూడా చూస్తున్నాను. ఆ రోజుతో నా కెరీర్ ముగిసిపోయిందని భావించాను’ అని ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

అయినా ఐపీఎల్‌లో కాసుల వర్షం..

ఇన్ని సమస్యలు వచ్చినా యువరాజ్ సింగ్ పట్టు వదలలేదు. 2017 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన యువీ ఐపీఎల్ లోనూ మ్యాజిక్ చేశాడు. అదే ఏడాది యువరాజ్ కారణంగానే టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా ఓడిపోయిందని ఆరోపణలు వచ్చినప్పటికీ, ఐపీఎల్‌లో రికార్డు స్థాయిలో రూ.14 కోట్లకు యువరాజ్‌ని ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. అంతే కాదు యువరాజ్ సింగ్ ను 2015లోనే రికార్డు స్థాయిలో రూ.16 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..