AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keshav Maharaj: లంకేయులను ఓడించి ‘జై శ్రీరామ్’ అన్న సౌతాఫ్రికా క్రికెటర్.. పోస్ట్ వైరల్

శ్రీలంకతో జరిగిన 2 మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. తొలి టెస్టు మ్యాచ్‌లో లంకేయులను 233 పరుగుల తేడాతో ఓడించిన ఆఫ్రికన్లు.. రెండో టెస్టు మ్యాచ్‌లో 109 పరుగుల తేడాతో గెలుపొందారు. దీంతో సిరీస్‌ను 2-0తో సఫారీలు కైవసం చేసుకున్నారు.

Keshav Maharaj: లంకేయులను ఓడించి 'జై శ్రీరామ్' అన్న సౌతాఫ్రికా క్రికెటర్.. పోస్ట్ వైరల్
Keshav Maharaj
Basha Shek
|

Updated on: Dec 11, 2024 | 9:13 PM

Share

శ్రీలంకతో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 233 పరుగుల తేడాతో గెలుపొందిన దక్షిణాఫ్రికా రెండో టెస్టులో 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఇక శ్రీలంకతో రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ కేశవ్ మహారాజ్ నిర్ణయాత్మక విజేతగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 347 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేసింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో లంక జట్టు గెలుస్తుందని చాలా మంది భావించారు. అయితే ఆఖరి రోజు అద్భుతంగా బౌలింగ్ వేసిన కేశవ్ మహరాజ్.. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా చివరి రోజు ఆటలో కేశవ్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో లంక జట్టును 238 పరుగులకే ఆలౌట్ చేసి దక్షిణాఫ్రికా జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

ఈ గొప్ప విజయం తర్వాత, కేశవ మహారాజ్ మరోసారి తనకు ఇష్టమైన భగవంతుని స్మరించుకున్నాడు. 2-0 తేడాతో సిరీస్‌ను గెలుచుకున్న ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న కేశవ్.. జై శ్రీరామ్, జై హనుమాన్‌ అంటూ హ్యాష్‌ట్యాగ్ లను షేర్ చేశాడు. కేశవ మహారాజ్ శ్రీరాముని స్మరించుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠాపన సందర్భంగా కేశవ్ మహారాజ్ మన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ఆ తర్వాత అయోధ్యను కూడా పలు మార్లు సందర్శించాడు.

ఇవి కూడా చదవండి

కేశవ్ మహారాజ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు. అయితే వారు గత కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. అయితే కేశవ్ మహరాజ్ కుటుంబం మాత్రం హిందూ సంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇండియాలోని పలు దేవాలయాలను సందర్శించాడు కేశవ్ మహరాజ్.

గతంలో అయోధ్య రామాలయంలో కేశవ్ మహారాజ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..