AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు ప్రపంచకప్‌ అందించిన హీరో.. నేడు టీం పాలిట ఐరెన్‌లెగ్‌.. కట్‌చేస్తే.. స్వ్కాడ్ నుంచి పీకేసిన గంభీర్?

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్, జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్ పర్యటనకు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి, ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే యోచనలో సెలెక్టర్లు ఉన్నారు.

నాడు ప్రపంచకప్‌ అందించిన హీరో.. నేడు టీం పాలిట ఐరెన్‌లెగ్‌.. కట్‌చేస్తే.. స్వ్కాడ్ నుంచి పీకేసిన గంభీర్?
Team India T20i Team
Venkata Chari
|

Updated on: May 13, 2026 | 9:50 AM

Share

భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్ తప్పుకోనున్నాడా? గత కొంతకాలంగా సాగుతున్న ఈ ప్రచారానికి బీసీసీఐ వర్గాలు ఎట్టకేలకు స్పందించాయి. ప్రపంచకప్ విజేతగా నిలిచినప్పటికీ, పేలవ ఫామ్ కారణంగా సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా హార్దిక్ పాండ్యాను నియమిస్తారనే వార్తలపై స్పష్టతనిస్తూ, ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని బోర్డు కీలక ప్రకటన చేసింది.

అసలేం జరుగుతోంది..?

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌ను విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్‌గా చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. అయితే, ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరపున ఆయన ప్రదర్శన నిరాశాజనకంగా ఉండటంతో సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారత టీ20 పగ్గాలు చేపడతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి.

బీసీసీఐ వర్గాల వివరణ..

సూర్యకుమార్ తొలగింపు వార్తలను బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి. ఇవన్నీ కేవలం నిరాధారమైన ప్రచారాలని స్పష్టం చేశాయి. “కెప్టెన్‌ను ఎంపిక చేసేది సెలెక్టర్లు. ఇప్పటి వరకు అటు సెలక్షన్ కమిటీలో కానీ, ఇటు టీమ్ మేనేజ్‌మెంట్‌లో కానీ నాయకత్వ మార్పు గురించి ఎటువంటి చర్చ జరగలేదు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతానికి భారత టీ20 జట్టుకు అధికారిక కెప్టెన్‌గా కొనసాగుతారు” అని బోర్డు ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

రికార్డుల వీరుడు సూర్యకుమార్..

భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల తర్వాత ప్రపంచకప్ అందించిన మూడవ కెప్టెన్‌గా సూర్య నిలిచారు. 2026 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 32 సగటుతో 242 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించారు. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు సృష్టించడంలో ఆయన నాయకత్వం కీలకమైంది.

భారత్ ముందున్న సవాళ్లు..

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్, జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్ పర్యటనకు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి, ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే యోచనలో సెలెక్టర్లు ఉన్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీమ్ ఇండియా పిలుపు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి సూర్యకుమార్ కెప్టెన్సీకి వచ్చిన ముప్పేమీ లేనప్పటికీ, రాబోయే సిరీస్‌లలో ఆయన బ్యాటింగ్‌ ఫామ్‌ను సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు.

Follow Us
సూర్య కెప్టెన్సీ పోస్ట్ పీకేసిన గంభీర్.. కొత్తగా సారథి ఎవరంటే?
సూర్య కెప్టెన్సీ పోస్ట్ పీకేసిన గంభీర్.. కొత్తగా సారథి ఎవరంటే?
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్నిపెంచిన కేంద్ర ప్రభుత్వం
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్నిపెంచిన కేంద్ర ప్రభుత్వం
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!
32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల
32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల
ఆ సినిమా తర్వాత ఇల్లు , ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎంఎస్ రాజు..
ఆ సినిమా తర్వాత ఇల్లు , ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎంఎస్ రాజు..
రూల్‌ ఆఫ్‌ 72.. రూ.5 లక్షల పెట్టుబడి, రూ.10 లక్షల లాభం!
రూల్‌ ఆఫ్‌ 72.. రూ.5 లక్షల పెట్టుబడి, రూ.10 లక్షల లాభం!
శతమానం భవతి,వందేళ్ల వయసులోనూ నిండు నూరేళ్ల వేడుక జరుపుకున్న బామ్మ
శతమానం భవతి,వందేళ్ల వయసులోనూ నిండు నూరేళ్ల వేడుక జరుపుకున్న బామ్మ
శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు..
శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు..
అల్ఫపీడనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు!
అల్ఫపీడనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు!