AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Domestic Cricket: 40 ఏళ్ల వయసులో సచిన్ ఆడితే.. మీ ఇద్దరికి ఏమైంది? కోహ్లీ – రోహిత్‌లపై ఫ్యాన్స్ ఫైర్

Kohli - Rohit's Form Slump: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడిపోవడానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేలవమైన బ్యాటింగ్ ప్రధాన కారణం. వీరిద్దరూ రెండు మ్యాచ్‌ల్లోనూ పేలవ ప్రదర్శన చేయడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం వల్లే ఇలా జరిగిందని అభిమానులు వాదిస్తున్నారు. రంజీ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్‌లు ఆడాలని భావిస్తున్నారు.

Domestic Cricket: 40 ఏళ్ల వయసులో సచిన్ ఆడితే.. మీ ఇద్దరికి ఏమైంది? కోహ్లీ - రోహిత్‌లపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Virat Kohli
Venkata Chari
|

Updated on: Oct 28, 2024 | 9:34 PM

Share

Kohli – Rohit’s Form Slump: న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమిండియా 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. జట్టు ఈ పేలవ ప్రదర్శనకు బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వెటరన్‌లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ పేలవ బ్యాటింగ్‌ జట్టు ఓటమికి ప్రధాన కారణం. ఆడిన రెండు టెస్టుల్లో, ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒక ఇన్నింగ్స్‌లో సున్నాకి ఔటయ్యారు. కానీ, మిగిలిన ఇన్నింగ్స్‌లో వారు చాలా తక్కువ పరుగులు చేశారు. అనుభవజ్ఞులుగా జట్టును ముందుండి నడిపించాల్సిన వీరిద్దరూ ముందుగానే పెవిలియన్ చేరి ఇతర ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపారు. అందుకే వీరిద్దరిపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వస్తోన్న నేపథ్యంలో రోహిత్, కోహ్లీ తమ ఫామ్ కోసం దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కోహ్లీ-రోహిట్‌లను రంజీ ఆడనివ్వాలి..

బెంగళూరు, పూణె టెస్టుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, స్టార్ బ్యాట్స్ మెన్ ఇద్దరూ అభిమానులను నిరాశపరిచారు. పూణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటైన రోహిత్ రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే వికెట్ కోల్పోయాడు. కోహ్లీ పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో వీరిద్దరి పేలవ ప్రదర్శన చూసి అభిమానులు కోహ్లీ-రోహిత్‌పై ఆరోపణలు చేస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోవడంపై అభిమానులు ఈ ఇద్దరు దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను సూటి ప్రశ్నలు అడుగుతున్నారు. ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండూల్కర్ 40 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో ఆడితే.. రోహిత్-కోహ్లీ ఎందుకు ఆడకూడదని అభిమానులు సోషల్ మీడియాలో గళమెత్తారు.

దేశవాళీ క్రికెట్‌ ఆడి ఏళ్లు గడిచాయి..

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ దేశవాళీ క్రికెట్‌ ఆడి ఏళ్లు గడిచాయి. 2012లో కోహ్లీ తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. అయితే సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ మ్యాచ్ 2013లో ఆడాడు. అంటే, సచిన్ రిటైరయ్యే సమయంలో కూడా రంజీల్లో ఆడాడు. అయితే, 2012లో సచిన్ కంటే ముందు కోహ్లి మాత్రమే దేశవాళీ టోర్నీ ఆడాడు. మరోవైపు, రోహిత్ శర్మ చివరిసారిగా 2016లో దేశవాళీ క్రికెట్ ఆడాడు. కోహ్లి 12 ఏళ్లుగా దేశవాళీ క్రికెట్ ఆడగా, రోహిత్ కూడా 8 ఏళ్లుగా దేశవాళీ క్రికెట్ ఆడలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..