Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: 1063 రోజుల తర్వాత కోహ్లీని గుర్తించిన డీడీసీఏ.. కారణం ఆ ‘వందే’.. అసలు మ్యాటరేంటంటే?

Virat Kohli Felicitate: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నాడు. రైల్వేస్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శుక్రవారం విరాట్ కోహ్లీకి సన్మానం జరగనుంది. దేశం తరపున 100 టెస్టులు ఆడినందుకు విరాట్‌కు గౌరవం దక్కనుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విరాట్ 3 సంవత్సరాల క్రితం 100 టెస్టులు పూర్తి చేశాడు.

Virat Kohli: 1063 రోజుల తర్వాత కోహ్లీని గుర్తించిన డీడీసీఏ.. కారణం ఆ 'వందే'.. అసలు మ్యాటరేంటంటే?
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఫిట్‌గా ఉన్న ఆటగాళ్ల గురించి మాట్లాడితే, విరాట్ కోహ్లీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా తన ఫిట్‌నెస్‌కు పేరుగాంచిన కోహ్లీ, గాయం కారణంగా టీమ్ ఇండియాకు అరుదుగా దూరమవుతాడు. కానీ, గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన నాగ్‌పూర్ వన్డేలో, మోకాలి నొప్పి కారణంగా కోహ్లీని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారు.
Follow us
Venkata Chari

|

Updated on: Jan 30, 2025 | 11:00 PM

Virat Kohli Felicitate: విరాట్ కోహ్లీ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. తొలిరోజు ఆటలో బ్యాటింగ్ చేయకపోయినా రెండో రోజు బ్యాటింగ్ చేయడం ఖాయం. అయితే, విరాట్ బ్యాటింగ్ తర్వాత పెద్ద గౌరవం పొందబోతున్నాడు. ఎందుకంటే, 1063 రోజుల తర్వాత డీడీసీఏ భారీ సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేసింది. DDCA జనవరి 31న విరాట్ కోహ్లీని సన్మానించబోతోంది. 100 టెస్టులు ఆడినందుకుగాను విరాట్‌కు ఈ గౌరవం దక్కనుంది. ఆసక్తికరంగా, విరాట్ కోహ్లి 2022లో తన 100వ టెస్టు ఆడాడు. 1063 రోజుల తర్వాత, DDCA అతనిని గౌరవించడాన్ని గుర్తుచేసుకుంది.

విరాట్ తన 100వ టెస్టు ఎవరితో ఆడాడు?

విరాట్ కోహ్లీ మార్చి 4, 2022న శ్రీలంకతో తన కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ మొహాలీలో జరిగింది. ఈ టెస్ట్ తర్వాత, విరాట్ ఢిల్లీలో కూడా టెస్ట్ ఆడాడు. కానీ, అతనికి అప్పుడు గౌరవం అందలేదు. అయితే, ఇప్పుడు ఈ అనుభవజ్ఞుడికి గౌరవం లభిస్తోంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 123 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, ఈ ఆటగాడు 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. విరాట్ 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు.

100కు పైగా టెస్టులు ఆడిన 14 మంది భారతీయులు..

కేవలం 14 మంది ఆటగాళ్లు మాత్రమే భారత్ తరపున 100కుపైగా టెస్టు మ్యాచ్‌లు ఆడారు. సచిన్ అత్యధికంగా 200 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతడితో పాటు రాహుల్ ద్రవిడ్ 163 టెస్టులు ఆడాడు. వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, ఆర్ అశ్విన్, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్, ఛెతేశ్వర్ పుజారా, వీరేంద్ర సెహ్వాగ్ కూడా 100కి పైగా టెస్టులు ఆడారు.

ఇవి కూడా చదవండి

విరాట్ బ్యాటింగ్ కోసం వెయిటింగ్..

విరాట్ కోహ్లీని సత్కరించే ముందు, అతని బ్యాటింగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడుతున్నారు. తొలి రోజు రైల్వేస్‌ను 241 పరుగులకు ఆలౌట్ చేసిన ఢిల్లీ ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. తదుపరి వికెట్ పడిన తర్వాతే విరాట్ కోహ్లీ క్రీజులోకి దిగుతాడు. ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..