IND vs ZIM: హరారేలో చెలరేగిన వైభవ్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్..
India vs Zimbabwe 3rd T20I: వైభవ్ సూర్యవంశీ ఆడిన 81 పరుగుల ఇన్నింగ్స్ పుణ్యమా అని, మూడో టీ20లో భారత్ జింబాబ్వేకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హరారేలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

వైభవ్ సూర్యవంశీ ఆడిన 81 పరుగుల ఇన్నింగ్స్ పుణ్యమా అని, మూడో టీ20లో భారత్ జింబాబ్వేకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హరారేలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వైభవ్ 49 బంతుల్లో 81 పరుగులు చేయగా, అందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
సూర్యవంశీ తన ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. మదేవరే బౌలింగ్లో బ్రాడ్ ఎవాన్స్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో అతను అవుటయ్యాడు. ఎవాన్స్ శ్రేయాస్ అయ్యర్ను కూడా ఔట్ చేశాడు. ఇషాన్ కిషన్ 29 పరుగుల వద్ద సికందర్ రజా బౌలింగ్లో అవుటవ్వగా, అభిషేక్ శర్మ రెండు పరుగుల వద్ద బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
తొలి రెండు మ్యాచ్లలోనూ విజయం సాధించిన భారత జట్టు, మూడు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 2-0 ఆధిక్యం సాధించింది.
