Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Test Cricket : 1000+ రన్స్‌తో ఎలైట్ క్లబ్‌లో భారత్..టెస్ట్ క్రికెట్ చరిత్రలో హయ్యెస్ట్ స్కోర్ చేసిన టాప్ 4 టీమ్స్ ఇవే!

భారత్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి టీమిండియా 1014 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000+ పరుగులు సాధించిన నాలుగో జట్టుగా నిలిచింది. ఇతర టాప్ స్కోర్ల వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

Test Cricket : 1000+ రన్స్‌తో ఎలైట్ క్లబ్‌లో భారత్..టెస్ట్ క్రికెట్ చరిత్రలో హయ్యెస్ట్ స్కోర్ చేసిన టాప్ 4 టీమ్స్ ఇవే!
Test Cricket
Lohith Kumar
|

Updated on: Jul 06, 2025 | 7:34 PM

Share

Test Cricket : ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 1000 పరుగులకు పైగా సాధించిన నాలుగో జట్టుగా నిలిచింది. భారత క్రికెట్‌లో ఇది మొదటిసారి రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 1014 పరుగులు సాధించి, తమ టెస్ట్ ప్రయాణంలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్లు ఏవో వివరంగా తెలుసుకుందాం.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 4 జట్లు ఇవే

ఇంగ్లాండ్ – 1121 పరుగులు (1930)

ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆల్‌టైమ్ రికార్డును కలిగి ఉంది. 1930లో కింగ్‌స్టన్‌లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 849 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 272/9 వద్ద డిక్లేర్ చేసి, మొత్తం స్కోరును భారీగా 1121 పరుగులకు చేర్చింది. ఇది ఇప్పటికీ తిరుగులేని రికార్డు.

పాకిస్తాన్ – 1078 పరుగులు (2006)

ఈ జాబితాలో తర్వాతి స్థానంలో పాకిస్తాన్ ఉంది. 2006లో ఫైసలాబాద్‌లో భారత్‌తో జరిగిన సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ మొత్తం 1078 పరుగులు సాధించింది. వారు మొదటి ఇన్నింగ్స్‌లో 588 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో మరో 490 పరుగులు జోడించారు. అయితే ఆ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది.

ఆస్ట్రేలియా – 1028 పరుగులు (1934)

ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. 1934లో ఓవల్‌లో జరిగిన యాషెస్ టెస్ట్‌లో వారు 1028 పరుగులు సాధించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 701 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌పై అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చారు.

భారత్ – 1014 పరుగులు (2025)

ఇప్పుడు భారత్ ఈ అగ్రశ్రేణి జాబితాలోకి చేరింది. ఎడ్జ్‌బాస్టన్‌లోని బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో, భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 427/6 వద్ద డిక్లేర్ చేసి, తమ మొత్తం స్కోరును 1014 పరుగులకు చేర్చింది. భారత టెస్ట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 1000 పరుగుల మార్కును అధిగమించడం ఇది మొదటిసారి. ఈ ఘనత భారత క్రికెట్‌కు ఒక మైలురాయిగా నిలిచింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..