AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఓపెనింగ్ జోడీలో మార్పు.. నంబర్ 3లో మిస్టర్ 360 ప్లేయర్.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్లేయింగ్ XI ఇదే?

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో భారత జట్టు ఆర్డర్ పై అందరి దృష్టి నెలకొంది. ఆసియా కప్‌లో, ప్లేయింగ్-11లో భారత జట్టు చాలా ప్రయోగాలు చేసింది. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.

Team India: ఓపెనింగ్ జోడీలో మార్పు.. నంబర్ 3లో మిస్టర్ 360 ప్లేయర్.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్లేయింగ్ XI ఇదే?
Team India
Venkata Chari
|

Updated on: Sep 13, 2022 | 11:59 AM

Share

T20 World Cup 2022 India Playing XI: వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2022 కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం (ఆగస్టు 12) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. విశేషమేమిటంటే జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ వంటి ఫాస్ట్ బౌలర్లు గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం. దీంతో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

2022 టీ20 ప్రపంచకప్‌లో మిగతా జట్లు కూడా సత్తా చాటాలని తహతహలాడుతున్నాయని భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు బాగా తెలుసు. అటువంటి పరిస్థితిలో, మ్యాచ్‌ల సమయంలో అత్యుత్తమ ప్లేయింగ్-11ని బయటకు తీసుకురావడం చాలా ముఖ్యం. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో, ఆటగాళ్లందరూ తమ స్వంతంగా మ్యాచ్‌లను గెలవగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ 15 మందిలో నలుగురిని వదిలేసి ప్లేయింగ్-11 ఎంచుకోవడం చాలా కష్టమైన పని. అలాగే ఆటగాళ్లు ఎలాంటి బ్యాటింగ్ ఆర్డర్‌తో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. T20 ప్రపంచ కప్‌లో టీమిండియా అత్యుత్తమ ప్లేయింగ్-11 గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కోహ్లి-రోహిత్ ఓపెనింగ్ చేసే ఛాన్స్..

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2022 సమయంలో, KL రాహుల్ టాప్ ఆర్డర్‌లో ఇబ్బందులు పడుతూ కనిపించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతి లభించినప్పుడు, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఓపెనర్‌కు వచ్చారు. ఆ మ్యాచ్‌లో కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ అజేయంగా 122 పరుగులు చేశాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చినా ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. దీని తరువాత, సూర్యకుమార్ యాదవ్ మూడవ నంబర్‌లో బరిలోకి దిగడం చూడొచ్చు.

ఇది మిడిల్ ఆర్డర్..

మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడితే, హార్దిక్ పాండ్యా నాలుగో నంబర్‌లో మంచి ఎంపిక. మరోవైపు కేఎల్ రాహుల్‌ను ఐదో ర్యాంక్‌లో చూడొచ్చు. ధావన్, రోహిత్ ఓపెనింగ్ కారణంగా, రాహుల్ వన్డే క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు. టీ20 ప్రపంచకప్‌లో కూడా రాహుల్ ఇదే పాత్ర పోషించగలడు. రాహుల్ తర్వాత ఆరో నంబర్ ఫినిషర్ రోల్‌కు దినేష్ కార్తీక్ ఫిట్‌గా ఉంటాడు.

చివరి ఐదుగురు ఆటగాళ్లు వీరే..

ఏడవ స్థానంలో రవీంద్ర జడేజా పాత్రలో అక్షర్ పటేల్ కనిపించనున్నాడు. అదే సమయంలో, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ వరుసగా ఎనిమిది, తొమ్మిదో స్థానంలో రావచ్చు. గతంలో కూడా హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ బ్యాట్‌తో ఆకట్టుకునేలా ప్రదర్శనలు చేశారు. అదే సమయంలో, చివరి రెండు స్థానాల కోసం ప్లేయింగ్-11లో జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ వాదన బలంగా ఉంటుంది.

T20 ప్రపంచ కప్ 2022లో టీమిండియా అత్యుత్తమ ప్లేయింగ్-11: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ (వైస్-కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.

షమీ-చాహర్ కూడా సిద్ధం..

టీ20 ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీని స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది. కొన్ని కారణాల వల్ల టోర్నీ మధ్యలో బౌలర్ అవుట్ అయితే, షమీ తన లోటును సులభంగా పూరించవచ్చు. విశేషమేమిటంటే స్టాండ్ బై ప్లేయర్‌లో మరో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా ఉన్నాడు. దీపక్ చాహర్ కూడా ఆసియా కప్‌లో స్టాండ్‌బైగా ఉన్నాడు. అయితే అవేష్ ఖాన్ అస్వస్థతకు గురికావడంతో అతన్ని జట్టులోకి తీసుకున్నారు. దీంతో పాటు శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లను కూడా స్టాండ్ బై ప్లేయర్‌లుగా చేర్చారు.