Legend 90: గబ్బర్ రీఎంట్రీ ఇదిగో.. మరోసారి మైదానంలో బౌండరీల మోతే.. ఎప్పుడు, ఎక్కడంటే?
Legend 90: టీమిండియా దిగ్గజ ప్లేయర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం భారత జట్టుకు చాలా కాలంగా దూరంగా ఉన్నాడు. అయితే, ఐపీఎల్ వేలంలోనూ శిఖర్ ధావన్కు మొండిచేయి దక్కింది. తాజాగా, మరో కొత్త లీగ్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. దీనిపేరు లెజెండ్ 90 లీగ్. వచ్చే నెల ప్రారంభం కానుంది. ఇందులో 7 జట్లు పాల్గొంటున్నాయి.

Legend 90: భారత జట్టు మాజీ వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాలా కాలంగా జట్టుకు దూరమైన కారణంగా ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ధావన్ ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ టోర్నమెంట్లలో ఆడుతున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ఇప్పుడు లెజెండ్ 90 లీగ్లో ఆడటం కనిపిస్తుంది. ఢిల్లీ రాయల్స్ ధావన్ను తమ జట్టులో చేర్చుకుంది. గురువారం, ఫ్రాంచైజీ తన జట్టు జెర్సీని ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ వేడుకలో ధావన్ కూడా ఉన్నాడు.
ఢిల్లీ జట్టుకు ఆడనున్న శిఖర్ ధావన్..
జెర్సీని ఆవిష్కరించిన సందర్భంగా, ఢిల్లీ జట్టు యజమాని దేవేంద్ర కద్యన్ దీనిని ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. ‘ఈ రోజు ఢిల్లీ రాయల్స్కు ప్రత్యేకమైన క్షణం. ఎందుకంటే, మేం మా అధికారిక జెర్సీని అభిమానుల ముందు అందిస్తున్నాం. ఈ జెర్సీ మా జట్టు ఢిల్లీ రాయల్స్ విలువలు, ఆశయాలు, ఆట పట్ల మా నిబద్ధతను సూచిస్తుంది. దీంతో పాటు టోర్నీలో ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ జెర్సీ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
టోర్నీలో ఈ జెర్సీని ధరించేందుకు శిఖర్ ధావన్ ఆసక్తిని వ్యక్తం చేశాడు. ఢిల్లీ రాయల్స్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఓ ప్రకటనలో తెలిపాడు. అలాగే, మైదానంలో ఈ జెర్సీతో కొన్ని చిరస్మరణీయ క్షణాలను సృష్టించేందుకు అతను వేచి ఉన్నాడు.
⚠️ Warning: This smile has won more hearts than matches!#DelhiRoyals #TheRoyals #RisewithTheRoyals #Legend90 #SmileKing @DevenderKadyan_ pic.twitter.com/DT3Q2oJNni
— Delhi Royals (@DelhiRoyals) January 29, 2025
ఢిల్లీ రాయల్స్తో తమ భాగస్వామ్యంపై లెజెండ్ 90 లీగ్ డైరెక్టర్ శివన్ శర్మ మాట్లాడుతూ, ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ టోర్నమెంట్ రూపొందించారు. మా ఉమ్మడి నిబద్ధత, శ్రేష్ఠత లక్ష్యం ఈ ఆటగాళ్లకు మరోసారి జీవించడానికి, ఆట పట్ల వారి అభిరుచితో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని ఇస్తుంది’ అని తెలిపాడు.
ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 18 న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. ఈ సమయంలో, టైటిల్ పోరు 7 జట్ల మధ్య కనిపిస్తుంది. ఈ మ్యాచ్లన్నీ రాయ్పూర్లో జరగనున్నాయి. ఈ మెగా ఈవెంట్లో క్రికెట్ ప్రపంచంలోని చాలా మంది మాజీ ఆటగాళ్లు తమ మ్యాజిక్లను వ్యాప్తి చేయడం కనిపిస్తుంది.
ఢిల్లీ రాయల్స్ జట్టు..
శిఖర్ ధావన్, లెండిల్ సిమన్స్, ఏంజెలో పెరీరా, దనుష్క గుణతిలక, సహర్ద లుముంబా, లఖ్వీందర్ సింగ్, బ్రిజేష్ పటేల్, రాజ్విందర్ సింగ్, రాయద్ ఎమ్రిట్, పర్విందర్ అవానా, రాస్ టేలర్, జెరోమ్ టేలర్, సుమిత్ నర్వాల్.
మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..