AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. ఇంగ్లాండ్ పర్యటన నుంచి భారత్‌కు తిరిగొచ్చిన హెడ్ కోచ్..?

Team India: గంభీర్ కోచ్ అయిన తర్వాత, భారత జట్టు రెండోసారి స్వదేశానికి దూరంగా టెస్ట్ ఆడుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. శుభ్‌మాన్ గిల్ టీమ్ ఇండియా కెప్టెన్ నాయకత్వంలో ముందుకు సాగనుంది. ఆర్ అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు టెస్ట్‌ల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే.

Gautam Gambhir: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. ఇంగ్లాండ్ పర్యటన నుంచి భారత్‌కు తిరిగొచ్చిన హెడ్ కోచ్..?
Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Jun 13, 2025 | 2:54 PM

Share

Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా ఇంగ్లాండ్ పర్యటనను మధ్యలోనే వదిలి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గౌతమ్ గంభీర్ తల్లి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగానే గంభీర్ తన తల్లి వద్ద ఉండటానికి వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.

జూన్ 20న ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు సన్నాహాల్లో భాగంగా గంభీర్ గత వారం ఇంగ్లాండ్‌కు వెళ్లారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు గంభీర్ మార్గదర్శకత్వం ఎంతో కీలకం. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో రానున్న ఈ సిరీస్ కొత్త శకానికి నాంది పలకనుంది.

గంభీర్ తిరిగి ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చి సిరీస్‌కు అందుబాటులోకి వస్తారని భావిస్తున్నారు. ఈ కఠిన సమయంలో ఆయన తల్లి త్వరగా కోలుకోవాలని, గంభీర్ కుటుంబానికి ధైర్యం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ సంఘటన జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే, గంభీర్ లేకపోయినా, జట్టు తమ సన్నాహాలను కొనసాగిస్తోంది. ఈ రోజు బెకన్ హమ్‌లో నాలుగు రోజుల ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో భారత్ ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..