AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: షాకింగ్ న్యూస్.. అమ్ముడవ్వని భారత్, పాక్ మ్యాచ్ టిక్కెట్లు.. దెబ్బ కొట్టిన ఐసీసీ స్కెచ్..

T20 World Cup 2024 IND vs PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే, టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. సేల్‌కి వచ్చిన వెంటనే అయిపోతాయి. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన అన్ని టిక్కెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోలేదు.

IND vs PAK: షాకింగ్ న్యూస్.. అమ్ముడవ్వని భారత్, పాక్ మ్యాచ్ టిక్కెట్లు.. దెబ్బ కొట్టిన ఐసీసీ స్కెచ్..
Ind Vs Pak Match Tickets
Venkata Chari
|

Updated on: Jun 02, 2024 | 11:23 AM

Share

India vs Pakistan T20 Match Tickets Unsold: 9వ ఎడిషన్ టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ లీగ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచడానికి, ఐసీసీ ప్రపంచంలోని అతిపెద్ద దేశంలో మొదటిసారిగా వరల్డ్ వార్ ఆఫ్ ది వరల్డ్స్‌ను నిర్వహిస్తోంది. అలాగే ఈసారి లీగ్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. అనేక కారణాల వల్ల ఈ టీ20 ప్రపంచకప్ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా జూన్ 9న భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య జరిగే హైవోల్టేజీ యుద్ధం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే, మైదానంలో ఈ మ్యాచ్‌ని చూసేందుకు అభిమానులు నిరాసక్తత చెందుతున్నారని సమాచారం.

నిజానికి ఈ లీగ్‌లో మొదటి మ్యాచ్ హోస్ట్ USA, కెనడా మధ్య జరుగుతుంది. అయితే, ఈ టోర్నీలో అత్యంత హై ప్రొఫైల్ మ్యాచ్ జూన్ 9న భారత్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. లక్షలాది మంది కళ్లు ఈ మ్యాచ్ చూడాలని తహతహలాడుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా స్టేడియం కిక్కిరిసిపోతుంది. కానీ, ఈసారి అలా ఉండకపోవచ్చు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌కు ముందు వచ్చిన షాకింగ్ న్యూస్ ఏమిటంటే, ఈ మ్యాచ్‌కి సంబంధించిన అన్ని టిక్కెట్లు ఇంకా అమ్ముడవలేదు. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికీ ఐసీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

అన్ని టిక్కెట్లు అమ్ముడుపోలేదు..

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లు విక్రయం ప్రారంభమైన వెంటనే సేల్ అయిపోతుంటాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య పోరు జరిగినప్పుడు స్టేడియం మొత్తం హౌస్ ఫుల్ అవుతుంది. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన అన్ని టిక్కెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోలేదని సమాచారం. దీనికి కారణం ఈ మ్యాచ్ టిక్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఐసీసీ ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లను మూడు ప్యాకేజీలలో ఉంచింది. వీటిలో డైమండ్ క్లబ్, ప్రీమియం క్లబ్ లాంజ్, కార్నర్ క్లబ్ ఉన్నాయి.

కారణం ఏంటంటే?

డైమండ్ క్లబ్ టిక్కెట్లను కొనుగోలు చేసే అభిమానులకు అత్యుత్తమ సౌకర్యాలు లభిస్తాయి. అయితే దీనికి అభిమానులు రూ.8.34 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం క్లబ్ లాంజ్ టికెట్ ధర రూ. 2 లక్షలు, కార్నర్ క్లబ్ టికెట్ ధర రూ. 2.29 లక్షలు. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఐసీసీ టిక్కెట్‌ ధరలను చాలా ఖరీదుగా మార్చింది. అయితే దీని టిక్కెట్లన్నీ ఇంకా అమ్ముడుపోకపోవడం షాక్‌కు గురిచేస్తుంది.

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ద్వారా మరింత లాభం పొందాలని ఐసీసీ ఆలోచిస్తోంది. అయితే, టికెట్ ధరను ఎక్కువగా ఉంచడం ఐసీసీకి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌కు ముందు ఐసీసీ టిక్కెట్ ధరను తగ్గిస్తారా లేదా మ్యాచ్ సమయంలో ఖాళీ సీట్లు దర్శనమిస్తాయా అనేది మ్యాచ్ రోజు తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..