
పాకిస్థాన్
ఆగస్టు 14, 1947న పాకిస్థాన్ భారతదేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది. మహ్మద్ అలీ జిన్నాను పాకిస్థాన్ జాతిపితగా పరిగణిస్తారు. పాకిస్థాన్ దేశానికి జిన్నా మొదటి గవర్నర్ జనరల్ కాగా.. లియాఖత్ అలీ ఖాన్ మొదటి ప్రధాన మంత్రిగా పనిచేశారు.
పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్. లాహోర్, కరాచీ కూడా పాకిస్థాన్ దేశంలోని ప్రధాన నగరాలు. ఈ నగరాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. పాకిస్థాన్ భౌగోళికంగా ప్రపంచంలో 33వ అతిపెద్ద దేశం. దక్షిణాసియాలో రెండవ అతిపెద్ద దేశం. పాకిస్థాన్ 881,913 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
2023 నాటికి, పాకిస్థాన్ జనాభా 24.15 కోట్ల మంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా పరిగణించబడుతుంది. 2017 జనాభా ప్రకారం, పాకిస్థాన్ జనాభా 20.7 కోట్లు. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో పాకిస్థాన్ ఆరవ స్థానంలో ఉన్నది.
మత ప్రాతిపదిక పాకిస్థాన్ను భారతదేశం నుండి విభజించారు. కానీ బెంగాలీ భాష, గుర్తింపు కోసం ఉద్యమం తర్వాత, 1971లో పశ్చిమ పాకిస్థాన్ (ప్రస్తుత పాకిస్థాన్ దేశం) నుండి విడిపోయి తూర్పు పాకిస్థాన్ ( నేటి బంగ్లాదేశ్) ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రాథమికంగా వ్యవసాయంపై ఆధారపడింది. ఇక్కడ ప్రధాన మతం ఇస్లాం. ఇక్కడ ముస్లింల సంఖ్య 96 శాతం కాగా.. హిందువులు 1.6 శాతం ఉన్నారు. ఉర్దూ, ఇంగ్లీష్ ఆ దేశంలో అధికారిక భాషలుగా ఉన్నాయి.
పాకిస్థాన్ ఉగ్రవాదం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత వంటి కీలక సమస్యలతో సమమతమవుతోంది. పలు అంశాల్లో పాకిస్థాన్కు చైనా మద్ధతు లభిస్తోంది. అరీఫ్ అల్వీ ప్రస్తుతం పాకిస్థాన్ దేశాధ్యక్షుడిగా ఉన్నారు.
Pakistan: పీసీబీ అంతా గబ్బే.. చెత్త రాజకీయాలతో భ్రష్టు పట్టించారు.. అందుకే 6 నెలలకే తప్పుకున్నా..!
2011 వన్డే ప్రపంచకప్ను భారత్కు అందించిన కోచ్గా గ్యారీ కిర్స్టన్కు పేరుంది. పాకిస్థాన్తో తన అనుభవం కొంత చేదు అనుభూతిని మిగిల్చిందని ఆయన అంగీకరించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో నెలకొన్న అనిశ్చితి, కోచ్లకు పూర్తి స్వేచ్ఛ లేకపోవడం వంటి సమస్యలను కిర్స్టన్ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయి.
- Venkata Chari
- Updated on: Jun 16, 2025
- 11:55 am
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ నుంచి బాబర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. పీసీబీ షాకింగ్ నిర్ణయం..?
PAK vs BAN: ప్రస్తుతం, టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో, పాకిస్తాన్ జట్టుకు బాబర్, రిజ్వాన్, షాహీన్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల సేవలు అత్యంత ఆవశ్యకం. వారిని ఒక సాధారణ ద్వైపాక్షిక సిరీస్ కోసం తొలగించే నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమే అవుతుంది. ఒకవేళ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారా, లేక మరేదైనా వ్యూహాత్మక కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.
- Venkata Chari
- Updated on: May 21, 2025
- 11:49 am
IPL 2025: పీఎస్ఎల్కు హ్యాండిచ్చిన ఫారిన్ ప్లేయర్స్.. ఐపీఎల్ కోసం లగేజ్ ప్యాకప్
IPL vs PSL: తొలిసారి ఐపీఎల్తోపాటు పీఎస్ఎల్ను ప్రారంభించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్న కీలక ఆటగాళ్లను ఐపీఎల్కు తరలించడం పీఎస్ఎల్కు పెద్ద దెబ్బ. ఈ పరిణామం PSL ఫ్రాంచైజీలకు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టాలను కలిగించే అవకాశం ఉంది.
- Venkata Chari
- Updated on: May 16, 2025
- 7:09 am
PM Modi Operation Sindoor Update Highlights: ఉగ్రవాదుల క్రూరత్వానికి తగిన గుణపాఠం చెప్పాం: మోదీ
Narendra Modi on India Pakistan Ceasefire Updates in Telugu: నాలుగు రోజుల ఉద్రిక్తత తర్వాత శనివారం భారతదేశం- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. దీని తరువాత సరిహద్దులో ఉద్రిక్తత తగ్గింది. ఉగ్రవాదులపై భారతదేశం చర్య తీసుకున్న తర్వాత తలెత్తిన పరిస్థితి రెండు దేశాల మధ్య వివాదం ప్రారంభమయ్యేలా ఉంది.
- Subhash Goud
- Updated on: May 12, 2025
- 9:10 pm
Pakistan: వామ్మో.. పాకిస్తాన్ పర్యటనకు మేం పోం.. ఊహించిన షాక్తో పీసీబీకి కోట్ల నష్టం
Pakistan vs Bangladesh: భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టాలను కలిగిస్తుంది. ముందుగా పీసీబీ పీఎస్ఎల్ను రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు, అది మరో సిరీస్ హోస్టింగ్ హక్కులను కోల్పోయే ముప్పును ఎదుర్కొంటోంది. ఇది పాకిస్తాన్ సంపాదనపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
- Venkata Chari
- Updated on: May 11, 2025
- 7:40 am
పాకిస్తాన్కు ఊహించని షాక్.. ఇటు భారత్, అటు దుబాయ్.. ఇకపై PSL నిర్వహించడం కష్టమే?
Pakistan Super League Postponement: పాకిస్తాన్ సూపర్ లీగ్ గురించి మాట్లాడితే, మే 8న భారతదేశం డ్రోన్లతో దాడి చేసి పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలో రావల్పిండి స్టేడియం కూడా దెబ్బతింది. ఈ కారణంగా మే 8న జరగాల్సిన కరాచీ కింగ్స్ వర్సెస్ పెషావర్ జల్మి మ్యాచ్ వాయిదా పడింది.
- Venkata Chari
- Updated on: May 10, 2025
- 7:37 am
Pakistan: అసలే నష్టాలు.. ఆపై భారత్ దెబ్బకు బిచ్చమెత్తుకుంటోన్న పీసీబీ.. ఎన్ని కోట్లు లాస్ అంటే?
India Pakistan Tension: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PSL నుంచి ఆదాయాన్ని కోల్పోతోంది. ఆడిట్ నివేదిక ప్రకారం, ఫ్రాంచైజీలతో ఆర్థిక భాగస్వామ్య నమూనాతోపాటు ఇతర లోపాల కారణంగా నష్టాలు సంభవించాయి. పీసీబీ, పీఎస్ఎల్ను ఆర్థికంగా ఓ మంచి బ్రాండ్గా చూపించడానికి ప్రయత్నించింది. కానీ, నష్టాలతో..
- Venkata Chari
- Updated on: May 9, 2025
- 11:57 am
అలర్ట్.. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే చిక్కులే.. సైబర్ దాడికి పాక్ ప్లాన్.. ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్తో ఎటాక్?
Dance of the Hillary Virus: "డాన్స్ ఆఫ్ ది హిల్లరీ" వైరస్గా గుర్తించిన మాల్వేర్ వీడియో ఫైల్స్ లేదా డాక్యుమెంట్స్ రూపంలో పంపిణీ అవుతోంది. ఒకసారి యాక్టివేట్ అయితే ఈ వైరస్, మొబైల్ లేదా కంప్యూటర్లను తీవ్రంగా దెబ్బతీస్తుందని, బ్యాంక్ ఆధారాలతో సహా రహస్య డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసే అవకాశం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Venkata Chari
- Updated on: May 9, 2025
- 7:16 am
PSL 2025: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. పాకిస్తాన్ సూపర్ లీగ్కు షాకిచ్చిన విదేశీ ఆటగాళ్లు?
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం తీర్చుకుంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. దీనికి ప్రతిస్పందనగా, భారత సైన్యం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని 9 ప్రదేశాలపై వైమానిక దాడులు నిర్వహించింది.
- Venkata Chari
- Updated on: May 7, 2025
- 12:37 pm
Operation Sindoor: షోయబ్ మాలిక్ స్వగ్రామంపైనా భారత్ దాడి.. కారణం ఏంటంటే?
Shoaib Malik Home Town Sialkot: పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటూ, భారతదేశం పాకిస్తాన్లోని 9 ప్రదేశాలపై క్షిపణులను ప్రయోగించింది. వాటిలో ఒకటి లెజెండరీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పుట్టిన ప్రదేశం. భారతదేశం అక్కడ వైమానిక దాడి ఎందుకు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
- Venkata Chari
- Updated on: May 7, 2025
- 12:23 pm