AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాబాజ్ షరీఫ్ కు UAE బిగ్ షాక్.. పాకిస్తానీయులకు వీసాల రద్దు.. ఎందుకంటే..!

పాకిస్తాన్‌కు ఓ ముస్లిం దేశమే గట్టి షాక్ ఇచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తానీలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. యుఎఇలో పెరుగుతున్న నేరాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశ అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు అంతర్గత కార్యదర్శి సల్మాన్ చౌదరి తెలిపారు.

షాబాజ్ షరీఫ్ కు UAE బిగ్ షాక్.. పాకిస్తానీయులకు వీసాల రద్దు.. ఎందుకంటే..!
Uae Stops Issuing Visas To Pakistanis
Balaraju Goud
|

Updated on: Nov 27, 2025 | 9:04 PM

Share

పాకిస్తాన్‌కు ఓ ముస్లిం దేశమే గట్టి షాక్ ఇచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తానీలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. యుఎఇలో పెరుగుతున్న నేరాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశ అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు అంతర్గత కార్యదర్శి సల్మాన్ చౌదరి గురువారం (నవంబర్ 27, 2025) యుఎఇ పాకిస్తానీలకు వీసాలు జారీ చేయడం లేదని పేర్కొన్నారు.

పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్‌లో వచ్చిన ఒక కథనం ప్రకారం, మానవ హక్కులపై సెనేట్ ఫంక్షనల్ కమిటీ సమావేశంలో సల్మాన్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌లను నిషేధించడం మానుకున్నాయని ఆయన అన్నారు. నిషేధం విధిస్తే, దానిని ఎత్తివేయడం కష్టమని ఆయన అన్నారు.

పాకిస్తాన్ UAE తో దగ్గరి దౌత్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను కొనసాగిస్తుంది. మధ్యప్రాచ్యంలో పాకిస్తా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో UAE ఒకటి. ఇక్కడ పెద్ద సంఖ్యలో పాకిస్తానీ ప్రవాసులు నివసిస్తున్నారు. UAEలో రకరకాల వర్తక, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం బ్లూ దౌత్య పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నవారికి మాత్రమే UAE వీసాలు జారీ చేస్తోందని అధికారి ఒకరు తెలిపారు.

పాకిస్తాన్ సెనేట్ మానవ హక్కుల కమిటీ అధిపతి సమీనా ముంతాజ్ జెహ్రీ మాట్లాడుతూ, పాకిస్తానీయులు యుఎఇలో నేరాలకు పాల్పడుతున్నారని, అందుకే వీసాలు నిరాకరిస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత తక్కువ సంఖ్యలో మాత్రమే వీసాలు జారీ చేయడం జరుగుతుందని ఆమె అన్నారు.

ఇదిలావుంటే, పాకిస్తాన్‌లోని యుఎఇ రాయబారి సలేం ఎం. సలేం అల్ బవాబ్ అల్ జాబి ఈరోజు ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్‌తో సమావేశమయ్యారు. సమావేశంలో యుఎఇ వీసా సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా సంస్కరణల్లో ఆన్‌లైన్ వీసా ప్రాసెసింగ్, పాస్‌పోర్ట్ స్టాంపింగ్ లేకుండా ఇ-వీసాలు, వేగవంతమైన సిస్టమ్-టు-సిస్టమ్ కనెక్టివిటీ వంటి అంశాలపై చర్చలు జరిపారు. కాగా, ఈ ఏడాది జూలైలో కూడా పాకిస్తానీ పౌరులు వీసా తిరస్కరణ సమస్యను ఎదుర్కొన్నారు. దీని కారణంగా హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ తన యుఎఇ ప్రతినిధుల సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..