Pakistan: అసలే నష్టాలు.. ఆపై భారత్ దెబ్బకు బిచ్చమెత్తుకుంటోన్న పీసీబీ.. ఎన్ని కోట్లు లాస్ అంటే?
India Pakistan Tension: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PSL నుంచి ఆదాయాన్ని కోల్పోతోంది. ఆడిట్ నివేదిక ప్రకారం, ఫ్రాంచైజీలతో ఆర్థిక భాగస్వామ్య నమూనాతోపాటు ఇతర లోపాల కారణంగా నష్టాలు సంభవించాయి. పీసీబీ, పీఎస్ఎల్ను ఆర్థికంగా ఓ మంచి బ్రాండ్గా చూపించడానికి ప్రయత్నించింది. కానీ, నష్టాలతో..

India Pakistan Tension: భారత్తో శత్రుత్వం పెంచుకోవడం ద్వారా పాకిస్తాన్ పెద్ద తప్పు చేసింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద సంఘటన తర్వాత, మే 6, 7 తేదీల్లో రాత్రి పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసింది. అప్పటి నుంచి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ఉద్రిక్తత కారణంగా, మే 8న రావల్పిండిలో జరగాల్సిన పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ రద్దు చేశారు. ఇది మాత్రమే కాదు, పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లందరూ కూడా భయాందోళనలో ఉన్నారు.
టోర్నమెంట్లో పాల్గొనే కొంతమంది విదేశీ ఆటగాళ్ళు తమ దేశానికి తిరిగి రావడం గురించి ఫ్రాంచైజీలతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితిలో, PSL 10వ సీజన్ ఇప్పుడు రద్దు అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ వైపు నుంచి నిరంతరం డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటే, PSL ఈ సీజన్ పూర్తి చేయడం కష్టం. ఎందుకంటే, పాకిస్తాన్లోని కొన్ని ప్రధాన స్టేడియాలు భారత సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దివాళా తీస్తుంది. ఎందుకంటే, ఈ లీగ్ కారణంగా PCB నిరంతరం నష్టాలను చవిచూస్తోంది. PCB మాత్రమే కాదు, 6 జట్ల యజమానులు కూడా భారీ నష్టాలను చవిచూస్తారు.
ఆడిట్ నివేదిక ప్రకారం, గత ఐదు సీజన్లలో పిఎస్ఎల్ నుంచి పీసీబీ భారీ నష్టాలను చవిచూస్తోంది . ఫ్రాంచైజీకి ఎక్కువ వాటా ఇవ్వడం వల్ల ఈ నష్టం సంభవించింది. ఆడిట్ నివేదిక ప్రకారం, PSL ఫ్రాంచైజీలకు అధిక వాటాలు ఇవ్వడం వల్ల PCB రూ.1,637.977 మిలియన్ల నష్టాన్ని చవిచూసింది. పీసీబీ, ఫ్రాంచైజీ మధ్య 10 సంవత్సరాల ఒప్పందం ఉంది. 2025 లో 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ ఒప్పందంలో మార్పులు చేయడానికి అనుమతి ఉంటుంది.
ఐదవ సీజన్ నుండే పీసీబీకి నష్టాలు..
ఐదవ సీజన్ నుంచే పీఎస్ఎల్ నష్టాలను చవిచూస్తోంది. ఈమేరకు ఆడిట్ నివేదిక పేర్కొంది. మీడియా హక్కులలో ఫ్రాంచైజీ వాటాను 80 శాతానికి పెంచారు. PCB కి 20 శాతం మాత్రమే వస్తోంది. అదేవిధంగా, స్పాన్సర్షిప్ హక్కులలో, 40 శాతం ఫ్రాంచైజీకి, 60 శాతం PCBకి వెళ్ళాయి. టికెట్ల అమ్మకాలలో కూడా 90 శాతం ఫ్రాంచైజీలకు, 10 శాతం మాత్రమే PCBకి వెళ్తున్నాయి.
దుబయ్ మారిన పీఎస్ఎల్..
భారత్ ప్రతిదాడులతో పీసీబీ భయపడిపోయింది. ఈమేరకు రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసింది. దీంతో మిగతా మ్యాచ్లు జరిగే ఛాన్స్ ఉండదని భావించిని పీసీబీ.. దుబాయ్కి షిఫ్ట్ చేసింది. వేదికలు, షెడ్యూల్ ఇంకా ఖరారు చేయలేదు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..