AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: వామ్మో.. పాకిస్తాన్ పర్యటనకు మేం పోం.. ఊహించిన షాక్‌తో పీసీబీకి కోట్ల నష్టం

Pakistan vs Bangladesh: భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టాలను కలిగిస్తుంది. ముందుగా పీసీబీ పీఎస్‌ఎల్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు, అది మరో సిరీస్ హోస్టింగ్ హక్కులను కోల్పోయే ముప్పును ఎదుర్కొంటోంది. ఇది పాకిస్తాన్ సంపాదనపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Pakistan: వామ్మో.. పాకిస్తాన్ పర్యటనకు మేం పోం.. ఊహించిన షాక్‌తో పీసీబీకి కోట్ల నష్టం
Pakistan
Follow us
Venkata Chari

|

Updated on: May 11, 2025 | 7:40 AM

Bangladesh Cricket Team: భారతదేశంలోని నివాస ప్రాంతాలపై దాడులు చేయడం ద్వారా పాకిస్తాన్ నిరంతరం సమస్యలను సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. దీనికి భారత సైన్యం కూడా తగిన సమాధానం ఇచ్చింది. కొన్ని రోజుల ఘర్షణ తర్వాత, మే 9న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ప్రభావం చూపవచ్చు. దీంతో పీసీబీకి తీవ్ర నష్టం జరగవచ్చు. నిజానికి, బంగ్లాదేశ్ జట్టు తన పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకునే మూడ్‌లో ఉంది. తన ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటోంది. ఇదే జరిగితే, ఈ బంగ్లాదేశ్ పర్యటన నుంచి వచ్చే ఆదాయాలన్నీ పోతాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్‌కు క్రికెట్ ఓ ఆదాయ వనరుగా మారింది.

బంగ్లాదేశ్ ఏం చెప్పింది?

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మే 10న తమ జట్టు రెండు మ్యాచ్‌ల T20 సిరీస్ కోసం UAEలో పర్యటిస్తుందని ప్రకటించింది. కానీ, పాకిస్తాన్ పర్యటనలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్, భారతదేశం మధ్య ఉద్రిక్తత కారణంగా ఐపీఎల్, పీఎస్ఎల్ రెండూ వాయిదా పడ్డాయని బీసీబీ తెలిపింది. అందువల్ల, మే 25 నుంచి ప్రారంభమయ్యే తన జట్టు పర్యటనను వాయిదా వేయడం గురించి కూడా బోర్డు ఆలోచిస్తోంది.

మే 10న షేర్-ఎ-బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియంలో బీసీబీ డైరెక్టర్లు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. “బంగ్లాదేశ్ జట్టు షెడ్యూల్ చేసిన కార్యక్రమం ప్రకారం రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆతిథ్య దేశం UAEలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ వచ్చే వారం ప్రారంభం కానుంది. కానీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో నిరంతర చర్చలు జరుపుతోంది” అని BCB ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఆటగాళ్ల గురించి బోర్డు ఆందోళన..

ఆటగాళ్ల భద్రతకు సంబంధించి, బోర్డు మాట్లాడుతూ, “బీసీబీ తన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భద్రత కోసం బోర్డు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించాలనుకుంటోంది. పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత పర్యటనకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. తద్వారా జట్టు, బంగ్లాదేశ్ క్రికెట్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుంది” అని ప్రకటించింది. బంగ్లాదేశ్ జట్టు మే 17, 19 తేదీలలో యూఏఈతో టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత మే 25 నుంచి జూన్ 3 వరకు పాకిస్థాన్‌తో 5 టీ20లు ఆడనుంది. కానీ, ఇప్పుడు బోర్డు దానిని రద్దు చేయవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ నుంచి ఆదాయాన్ని కోల్పోవచ్చు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..