AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: సెమీస్, ఫైనల్‌‌కు వర్షం ముప్పు ఉంటే.. ఫలితం కోసం నో టెన్షన్.. రూల్స్ ఎలా ఉన్నాయంటే?

వర్షంతో ప్రతి టీ20 మ్యాచ్‌లో కనీసం 10 ఓవర్లు ఆడితేనే మ్యాచ్ ఫలితం నిర్ణయించేవారు. అయితే టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఫలితాన్ని పొండాలంటే కనీసం 20 ఓవర్లు ఆడాల్సిందే.

T20 World Cup: సెమీస్, ఫైనల్‌‌కు  వర్షం ముప్పు ఉంటే.. ఫలితం కోసం నో టెన్షన్.. రూల్స్ ఎలా ఉన్నాయంటే?
T20 World Cup Semi Finals
Venkata Chari
|

Updated on: Nov 05, 2022 | 7:27 PM

Share

టీ20 ప్రపంచ కప్ 2022 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు నవంబర్ 9, 10 తేదీలలో జరుగుతాయి. అయితే, వర్షం పడితే మ్యాచ్‌కు సంబంధించిన నిబంధనలను ఐసీసీ మార్చింది. దీనిపై ఐసీసీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. మీడియా కథనాల ప్రకారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో కనీసం 20 ఓవర్లు ఉండాలని ఐసీసీ నిర్ణయించిందని, అప్పుడే మ్యాచ్ ఫలితం తేలనుంది. వర్షం కారణంగా 20 ఓవర్లు ఆడకపోతే తమ గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో 40 ఓవర్లు ఉంటాయి. వర్షం వస్తే, కనీసం ఐదు ఓవర్లు ఇన్నింగ్స్‌లో ఆడాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మ్యాచ్ ఫలితం నిర్ణయిస్తారు. ఒక ఇన్నింగ్స్‌లో వర్షం కారణంగా ఐదు ఓవర్లు ఆడలేకపోతే, మ్యాచ్ రద్దు చేస్తారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఈ నిబంధన కింద మ్యాచ్‌లు జరుగుతుండగా, ఈ నిబంధనతో ఐర్లాండ్ టీం ఇంగ్లండ్‌ను ఓడించింది.

సెమీఫైనల్స్ నిబంధనలు..

అయితే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ముందు ఐసీసీ ఈ నిబంధనలు వేరుగా ఉంటాయి. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల ఫలితాలను పొందాలంటే, ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు ఆడాలి. ఒకవేళ మ్యాచ్ జరగాల్సిన తేదీన వర్షం కారణంగా ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ఆడకపోతే, మ్యాచ్ అక్కడితో ఆగి, మరుసటి రోజు అక్కడి నుంచే మ్యాచ్ ప్రారంభమవుతుంది. 2019లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. మిగిలిన ఓవర్లు తర్వాత నిర్వహించారు. కనీసం 20 ఓవర్లు ఆడిన తర్వాత మ్యాచ్ ఫలితం ప్రకటిస్తారు.

వర్షం కారణంగా మరుసటి రోజు ఆట జరగకపోతే లేదా ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ఉంటే, మ్యాచ్ రద్దు చేస్తారు. సూపర్-12 దశలో తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 10 ఓవర్లు ముగిసేలోపు జట్టు ఆలౌట్ అయితే మాత్రమే 20 ఓవర్ల కంటే తక్కువ మ్యాచ్ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఫైనల్‌కు నియమాలు?

ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఫలితం రావాలంటే ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. లేకపోతే, మిగిలిన ఓవర్లు మరుసటి రోజు ఆడిస్తారు. అప్పుడు కూడా 20 ఓవర్లు ఆడకపోతే ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. అయితే మ్యాచ్ టై అయితే ఉమ్మడి విజేతలు ఉండరు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్లు కొనసాగుతాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..