AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌, కోహ్లీ ఉండాల్సిందే.. లేకుంటే అంతే సంగతులు: మాజీ క్రికెటర్‌

T20 ప్రపంచకప్ 2024 లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా ? ఈ ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు గత ఏడాది నుంచి టీమ్ ఇండియా తరఫున ఏ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. అందుకే టీ20 ప్రపంచకప్ ఎంపికకు రోహిత్ శర్మ, కోహ్లీలను పరిగణనలోకి తీసుకోవడంపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌, కోహ్లీ ఉండాల్సిందే.. లేకుంటే అంతే సంగతులు: మాజీ క్రికెటర్‌
Virat Kohli, Rohit Sharma
Basha Shek
|

Updated on: Jan 07, 2024 | 7:04 PM

Share

T20 ప్రపంచకప్ 2024 లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా ? ఈ ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు గత ఏడాది నుంచి టీమ్ ఇండియా తరఫున ఏ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. అందుకే టీ20 ప్రపంచకప్ ఎంపికకు రోహిత్ శర్మ, కోహ్లీలను పరిగణనలోకి తీసుకోవడంపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. అయితే తాజా పరిణామం ప్రకారం హిట్ మ్యాన్ , కింగ్ కోహ్లి మళ్లీ టీ20 క్రికెట్ లోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ ఇద్దరు ప్రముఖులతో చర్చలు జరిపారు. అందుకే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ టీ20 క్రికెట్‌లో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను పరిగణనలోకి తీసుకోవాలని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ.. ఇద్దరినీ వదులుకునే అవకాశం లేదని అన్నారు. ‘కొన్నిసార్లు 35-36 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఫిట్‌నెస్‌ లెవెల్స్‌ క్రమంగా తగ్గిపోతాయి. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విషయంలో మాత్రం అలాంటి గందరగోళానికి తావు లేదు. ఎందుకంటే ఈ వయసులోనూ ఇద్దరూ చాలా బాగా ఫీల్డింగ్ చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లోనూ తన ఫామ్‌ను ప్రదర్శించాడు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యేందుకు అర్హులని భావిస్తున్నాను’ అని సునీల్ గవాస్కర్ తెలిపాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులో ఉండటం చాలా పెద్ద ప్రయోజనం ఉంటుందన్నారు సునీల్‌ గవాస్కర్‌. ‘ఇద్దరు సీనియర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే, అది తోటి ఆటగాళ్లను ప్రభావితం చేస్తుంది. వీరిద్దరూ మైదానంలో కూడా తమ వంతు సహకారం అందించగలరు. ఇన్ని కారణాల వల్ల టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కోసం ఎదురు చూస్తున్నాను’ అని సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఈసారి టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. అమెరికా-వెస్టిండీస్‌లో జరిగే ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను 4 గ్రూపులుగా విభజించారు. దీని ప్రకారం ఈ టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..