IND vs SL 3rd ODI : శ్రీలంక లక్ష్యం 226 పరుగులు.. ఫెయిలైన మిడిలార్డర్.. రాణించిన పృథ్వీషా, సంజు శాంసన్‌..

IND vs SL 3rd ODI : శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు భారత్ గెలవగా మూడే వన్డే ఈ రోజు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది.

IND vs SL 3rd ODI : శ్రీలంక లక్ష్యం 226 పరుగులు.. ఫెయిలైన మిడిలార్డర్.. రాణించిన పృథ్వీషా, సంజు శాంసన్‌..
Ind Vs Sl
Follow us

|

Updated on: Jul 23, 2021 | 8:22 PM

IND vs SL 3rd ODI : శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు భారత్ గెలవగా మూడే వన్డే ఈ రోజు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబట్టుకోవాలని శ్రీలకం భావిస్తోంది. అయితే ఈసారి టాస్ గెలిచిన ఇండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా కెప్టెన్ శిఖర్ ధావన్, పృథ్వీషా బరిలోకి దిగారు. మొదటి ఓవర్ నుంచే ధాటిగా ఆడిన శిఖర్ ధావన్ చమీర బౌలింగ్‌లో మినోద్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 29 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

తర్వాత సంజు శాంసన్, ప్రుధ్వీషా ఇద్దరు కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో పృథ్వీషా.. దసున్ శనక బౌలింగ్‌లో 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీగా ఔటయ్యాడు. తర్వాత 19 ఓవర్‌లో సంజు శాంసన్ 46 పరుగులు కూడా ఔటయ్యాడు. స్వల్ప పరుగుల తేడాతో ఇద్దరు అర్ధ సెంచరీలు చేజార్చుకున్నారు. ఈ క్రమంలో భారత్ 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. గంట తర్వాత మ్యాచ్‌ని 47 ఓవర్లకు కుదించారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెంటనే మనీశ్ 158 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్య ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. 184 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడుతూ..40 పరుగుల వద్ద ఎల్బీ గా ఔటయ్యాడు. ఆ తర్వాత ధనుంజయ వేసిన 33 ఓవర్‌లో భారత్ రెండు వికెట్లు వెనువెంటనే కోల్పోయింది. దీంతో 195 పరుగులకు 8 వికెట్లు చేజార్చుకుంది. చివరలో టెయిలెండర్లు మరో 30 పరుగులు జోడించి 43.1 ఓవర్లో 225 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో శ్రీలంక లక్ష్యం 226 పరుగులుగా నిర్ణయించారు. లంక బౌలర్ అకిల ధనంజయ, జయవిక్రమ 3 వికెట్లు సాధించారు.

Road accident : నాగర్ కర్నూలు జిల్లా చెన్నారం గేట్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

Olympics 2021 Opening Ceremony Live: విశ్వ క్రీడా మహోత్సవం ప్రారంభం.. భారత అథ్లెట్లకు చప్పట్లతో వెల్‌కం చెప్పిన ప్రధాని మోడీ

Viral Video: చిన్నారి సైకిల్‌పై కూర్చున్న భారీకాయం.. ఆతరువాత ఏం జరిగిందో తెలుసా?

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..