IPL 2025: గ్రౌండ్ బయట సైలెంట్ బరిలోకి దిగితే వైలెంట్! పంజాబ్ నయా హీరోపై ప్రీతి పాప ఎమోషనల్ ట్వీట్
ఐపీఎల్ 2025లో ప్రియాంష్ ఆర్య అజేయ సెంచరీతో పంజాబ్ కింగ్స్కు అద్భుత విజయాన్ని అందించాడు. 42 బంతుల్లో 103 పరుగులు చేసి, జట్టును గెలిపించడమే కాక, తన పేరును క్రికెట్ లో చిరస్థాయిగా ముద్రించాడు. అతని ప్రదర్శన చూసి ప్రీతి జింటా ఎమోషనల్గా స్పందిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేశారు. ఈ మ్యాచ్ ప్రియాంష్ ఆర్య జీవితంలో కీలక మలుపుగా నిలిచింది.

పంజాబ్ కింగ్స్ యువ బ్యాట్స్మన్ ప్రియాంష్ ఆర్య తన అద్భుతమైన ఆటతీరుతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన నేపథ్యంలో, బాలీవుడ్ నటి, PBKS సహ యజమాని ప్రీతి జింటా తనపై ప్రేమను, గర్వాన్ని హృదయపూర్వకంగా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8, 2025న కొత్తగా నిర్మించబడిన ముల్లాన్పూర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ప్రియాంష్ ఆర్య చెన్నై సూపర్ కింగ్స్పై అజేయ సెంచరీతో (42 బంతుల్లో 103 పరుగులు) చరిత్ర సృష్టించాడు. అతని పర్ఫార్మెన్స్ కేవలం అభిమానులను, జట్టును మాత్రమే కాదు, ప్రీతి జింటా వంటి యజమానులను కూడా ఆకర్షించింది.
ఆ మ్యాచ్ అనంతరం, ప్రీతి జింటా X (మాజీ ట్విట్టర్) ద్వారా ఒక భావోద్వేగ గమనికను పంచుకున్నారు. “నిన్న రాత్రి చాలా ప్రత్యేకంగా మారింది. మేము ఒక లెజెండ్ గర్జనను చూశాం, ఒక ప్రకాశవంతమైన నక్షత్రం జన్మించడాన్ని చూశాం!” అంటూ ఆమె మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం ప్రియాంష్ను మొదటిసారి కలిసినప్పుడు అతను సిగ్గుపడేలా, నిశ్శబ్దంగా ఉన్నాడని, మాట్లాడేందుకు కూడా ముందుకురాలేదని ఆమె చెప్పారు. అయితే మైదానంలో అతని ఆటతీరు దాని పూర్తి విరుద్ధంగా ఉండటం అద్భుతం అని ఆమె పేర్కొన్నారు.
“ముందుగా మైదానంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసి, 42 బంతుల్లో 103 పరుగులు చేయడం చాలా గొప్ప విషయం. నిన్ను చూసి ఎంతో గర్వంగా ఉంది ప్రియాంష్,” అని ప్రీతి పేర్కొన్నారు. “మాటల కంటే చర్యలు ఎలా బిగ్గరగా మాట్లాడతాయో నువ్వే ఉదాహరణ. నవ్వుతూ, ప్రకాశిస్తూ ఉండి మైదానంలోనూ బయటనూ అందరికీ స్పూర్తిగా ఉండి,” అంటూ ఆమె ఎమోషనల్ మెసేజ్ను ముగించారు.
పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 219/6 భారీ స్కోరు చేసింది. ఈ స్కోరులో ప్రధాన హీరోగా నిలిచిన ప్రియాంష్ ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్ ధాటికి చెన్నై బాగా యత్నించినప్పటికీ 201/5 స్కోరుతో 18 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఈ విజయంతో పంజాబ్ ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లలో మూడవ విజయం నమోదు చేసి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.
ఈ మ్యాచ్ ప్రియాంష్ ఆర్యకు కేవలం ఒక గేమ్నే కాదు, జీవితాన్ని మార్చిన ఘట్టంగా మారింది. మైదానంలో ఓ యువ ఆటగాడు ఎలా తన ప్రతిభను ప్రపంచానికి చాటగలడో ఈ మ్యాచ్లో ప్రియాంష్ చేసిన పర్ఫార్మెన్స్ దానికి ప్రతీకగా నిలిచింది. ప్రీతి జింటా తన ఎమోషనల్ హార్ట్ఫెల్ట్ మెసేజ్తో ఆ అభినందనకు ఓ విలక్షణ ముద్ర వేసింది. “రోర్ ఆఫ్ ఎ లెజెండ్” అన్న మాటలు ప్రియాంష్ ఆర్య పేరిట క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి.
Last night was beyond special. We witnessed an explosive game of cricket, the roar of a legend and the birth of a bright Star !
I met 24 year old Priyansh Arya with some of our other young players a couple of days ago. He was quiet, shy & unassuming & did not utter a word… pic.twitter.com/HtJPFsx1mf
— Preity G Zinta (@realpreityzinta) April 9, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



