IPL 2025: మొన్న చెపాక్లో.. నేడు ముంబైలో.. 10 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసేందుకు ఆర్సీబీ రెడీ?
IPL 2025, Mumbai Indians vs Royal Challengers Bengaluru, 20th Match: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ 33 సార్లు తలపడ్డాయి. ఈ సమయంలో ముంబై ఇండియన్స్ 19 సార్లు గెలిచింది. ముంబైపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది.

IPL 2025: ఐపీఎల్ సీజన్-18 లోని 20వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ఉత్కంఠ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, ముంబై ఇండియన్స్ను సొంతగడ్డపై ఓడించడం అంత సులభం కాదు. కానీ, ఈసారి ఆర్సీబీ కొత్త మూడ్లో ఉంది. 17 ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో బలీయమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించిన ఆర్సీబీ.. ఇప్పుడు ముంబైలోనూ విజయ జెండా ఎగురవేస్తామని నమ్మకంగా ఉంది.
10 ఏళ్లలో ఒక్క విజయం కూడా సాధించని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గెలిచి 10 సంవత్సరాలు అయింది. చివరిసారిగా 2015లో గెలిచింది. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ను సొంతగడ్డపై ఎప్పుడూ ఓడించలేకపోయింది.
ఇదిలా ఉండగా, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియంలో 6 సార్లు తలపడ్డాయి. 2016లో ఆర్సీబీని ముంబై 6 వికెట్ల తేడాతో ఓడించగా, 2018లో ఆర్సీబీ 46 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2019లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ముంబై ఇండియన్స్ 2023లో 6 వికెట్ల తేడాతో, 2024లో 7 వికెట్ల తేడాతో గెలిచింది.
అంటే, 2015 నుంచి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ గెలవలేదు. ఇప్పుడు కొత్త జట్టుతో బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ 10 సంవత్సరాల పరాజయాల పరంపరను బద్దలు కొట్టగలమని నమ్మకంగా ఉంది.
చెపాక్ కోటను ఛేదించిన బెంగళూరు..
17 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో ఆర్సీబీ గెలిచింది. చివరిసారిగా 2008లో గెలిచిన ఆర్సీబీ ఈసారి CSKని ఓడించి చరిత్ర సృష్టించింది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు ముంబై ఇండియన్స్పై కొత్త చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు.
కాబట్టి, ఈరోజు మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే, ఖచ్చితంగా కొత్త చరిత్ర సృష్టించనుంది. దీని ప్రకారం, వాంఖడేలో ఆర్సీబీ విజయ పతాకాన్ని ఎగురవేస్తుందో లేదో చూడాలి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
