AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: రోహిత్ రాకపై నోరు విప్పిన పాకిస్తాన్! BCCI ని వేడుకుంటున్న PCB అధికారులు..

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు రాలేదన్న వార్తలపై పీసీబీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బీసీసీఐ ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పీసీబీ ఆతిథ్య దేశం పేరును జెర్సీపై ముద్రించకపోవడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు క్రికెట్‌లో రాజకీయాల ప్రభావం పెరుగుతున్నట్లు సూచిస్తున్నాయి.

Champions Trophy: రోహిత్ రాకపై నోరు విప్పిన పాకిస్తాన్! BCCI ని వేడుకుంటున్న PCB అధికారులు..
Rohit Sharma Icc Champions Trophy
Narsimha
|

Updated on: Jan 21, 2025 | 11:41 AM

Share

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనడం లేదన్న వార్తలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్‌లో ప్రారంభమవనున్న ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు కెప్టెన్ల ఫోటోషూట్, ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ వంటి కార్యక్రమాల్లో రోహిత్ హాజరవుతారని భావించినప్పటికీ, బీసీసీఐ ఆయన పాకిస్థాన్ ప్రయాణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, రోహిత్ శర్మను పాకిస్థాన్‌కు పంపకుండా బీసీసీఐ తీసుకున్న అనుమానాస్పద నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పీసీబీ అధికారి ఒకరు, “క్రికెట్‌లో రాజకీయాలు జోక్యం చేసుకోవడం మంచిది కాదు. బీసీసీఐ పాకిస్థాన్‌లో జరిగే ప్రారంభ వేడుకలకు రోహిత్‌ను పంపడంపై స్పష్టత ఇవ్వకపోవడం మాకు నిరాశ కలిగిస్తోంది. అంతేకాకుండా, జట్టుపై ఆతిథ్య దేశం పేరు ముద్రించకపోవాలని తాము అనుకోవడం బాధాకరం” అని అన్నారు.

భారత జట్టు షెడ్యూల్

భారత్ తమ టోర్నమెంట్‌ను ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో ప్రారంభించనుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఫిబ్రవరి 23న జరిగే పాకిస్థాన్ మ్యాచ్ పట్ల ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో గ్రూప్ దశ చివరి మ్యాచ్ ఆడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు:

రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రవింద్ర జడేజా, రిషబ్ జడేజా .

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్‌ జట్టు గతంలో అద్భుత ప్రదర్శనలు చేసింది. 2013లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్‌ చివరిసారిగా ఈ ట్రోఫీని గెలుచుకుంది. అయితే, 2017లో జరిగిన చివరి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ ఫైనల్‌ చేరింది కానీ పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది.

2025లో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో భారత్‌ మరోసారి ట్రోఫీని తమ సొంతం చేసుకునే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు తమ విజయగాధను కొనసాగించాలన్న ఉత్సాహంతో బలమైన జట్టుతో సిద్ధమవుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడటంతో పాటు, ఇతర అగ్రదేశాల క్రికెట్ జట్లతో కూడా పోటీ ఇవ్వాల్సి ఉంది.

ఈ టోర్నమెంట్‌ గడచిన సార్ల కంటే మరింత ఉత్కంఠగా ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ భారత క్రికెట్ చరిత్రలో మరో గర్వకారణంగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..