Virat Kohli: స్విమింగ్ ఫుల్‎లో ఆర్సీబీ ఆటగాళ్లు.. వైరల్‎గా మారిన విరాట్ ఫొటోలు

విరాట్ కోహ్లీ ప్రపంచంలో మేటి బ్యాట్స్‎మెన్స్‎లో ఒక్కరు. అతని ఆటతో భారత్‎కు ఎన్ని విజయాలను అందించారు...

Virat Kohli: స్విమింగ్ ఫుల్‎లో ఆర్సీబీ ఆటగాళ్లు.. వైరల్‎గా మారిన విరాట్ ఫొటోలు
Virat Kohli
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 28, 2021 | 4:00 PM

విరాట్ కోహ్లీ ప్రపంచంలో మేటి బ్యాట్స్‎మెన్స్‎లో ఒక్కరు. అతని ఆటతో భారత్‎కు ఎన్ని విజయాలను అందించారు. విరాట్ ఆటకే కాకుండా ఫిట్‌నెస్‎కు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తారు. కోహ్లీ ఆటకే కాకుండా అతని అత్యన్నత శరీరాకడతికి, ఫిట్‌నెస్‎కు ప్రశంసలు అందుకుంటున్నారు. ఐపీఎల్‎లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న అతను జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ రెండో దశలో ఆర్సీబీ రెండు వరుస ఓటముల తర్వాత ముంబైపై విజయం సాధించి గాడిలో పడింది. ముంబైతో జరిగిన మ్యాచ్‎లో కోహ్లీ 51 పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఊపు మీద ఉన్న బెంగళూరు ఆటగాళ్లు ఈత కొలనులో సరదాగా గడిపారు. ఈత కొలనులో విరాట్‎తో పాటు సహచర ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ముఖ్యంగా కోహ్లీ ఫొటోలపై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు.

బెంగళూరు ఫ్రాంచైజీ తమ కెప్టెన్ కోహ్లీ మరింత దూకుడుగా ఉండాలని కోరుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఆర్సీబీ బౌలర్ డేల్ స్టెయిన్ అన్నారు. విరాట్‎ను అందరు గౌరవిస్తారని.. అతనిని ఎంతగానో ఆరాధిస్తారని స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ డగౌట్‌లో స్టెయిన్ చెప్పారు. ఇటీవల ఇంగ్లాండ్‎తో జరిగిన టెస్ట్ సీరిస్‎లో కోహ్లీ బాగా ఆడారని అన్నారు. కెప్టెన్‎గా జట్టును ముందుండి నడిపించారని చెప్పుకొచ్చారు. ఆర్సీబీ కెప్టెన్‎గా విరాట్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతారని ఇదీ తాను డ్రెసింగ్ రూంలో చూశాసని తెలిపారు.

రెండో దశలో మూడు మ్యాచులు ఆడిన కోహ్లీ రెండు అర్థసెంచరీలు చేశాడు. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఐపీఎల్-2021లో పది మ్యాచులు ఆడి ఆరింటిలో విజయం సాధించింది. నాలుగింటిలో ఓడిపోయింది.

Read also.. David Warner: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ జట్టుకు డేవిడ్ భాయ్ గుడ్ బై.?