AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Dravid: తండ్రి అడుగుజాడల్లోనే.. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో రాహుల్ ద్రవిడ్ కుమారుడు.. ఎంత ధర పలికాడంటే?

భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. క్రికెటర్ గా మారేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాడు. తాజాగా సుమిత్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లోకి అడుగు పెట్టాడు.

Rahul Dravid: తండ్రి అడుగుజాడల్లోనే.. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో రాహుల్ ద్రవిడ్ కుమారుడు.. ఎంత ధర పలికాడంటే?
Rahul Dravid's Son
Basha Shek
|

Updated on: Jul 27, 2024 | 3:02 PM

Share

భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. క్రికెటర్ గా మారేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాడు. తాజాగా సుమిత్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లోకి అడుగు పెట్టాడు. బెంగళూరులో జరిగిన వేలంలో మైసూర్ వారియర్స్ ఫ్రాంచైజీ సమిత్‌ను కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ అయిన 18 ఏళ్ల సమిత్ ద్రవిడ్ గతంలో కర్ణాటక U-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2023-24 కూచ్ బెహార్ ట్రోఫీని గెలుచుకున్న కర్ణాటక జూనియర్ జట్టులో కూడా సమిత్ ద్రవిడ్ కూడా సభ్యుడు. కాగా మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్న రాహుల్ ద్రవిడ్ కుమారుడిని తొలిసారిగా మైసూర్ వారియర్స్ ఫ్రాంచైజీ రూ.50,000కు కొనుగోలు చేసింది. ఇచ్చి కొన్నారు. దీని ప్రకారం ఈసారి మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లో కరుణ్ నాయర్ మైసూర్ వారియర్స్ జట్టుకు సమిత్ ద్రవిడ్ ప్రాతినిధ్యం వహిస్తాడు.

మైసూర్ వారియర్స్ జట్టు: కరుణ్ నాయర్ (కెప్టెన్), కార్తీక్ సిఎ, మనోజ్ భాండాగే, కార్తీక్ ఎస్‌యు, జగదీష్ సుచిత్, కృష్ణప్ప గౌతమ్, విద్యాధర్ పాటిల్, వెంకటేష్ ఎం, హర్షిల్ ధర్మాని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్ దేవాడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాస్తవ, జాస్పర్ EJ, పర్షిద్ కృష్ణ, మహ్మద్ సర్ఫరాజ్ అష్రఫ్.

ఇవి కూడా చదవండి

మహారాజా ట్రోఫీ 2024 సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1 వరకు కొనసాగుతుంది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

మహరాజా ట్రోఫీ టీ20 లీగ్ వేలంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఎల్ఆర్ చేతన్ ఈసారి ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. గత సీజన్‌లో గుల్బర్గా మిస్టిక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన చేతన్ ఈసారి రూ.8.2 లక్షలు పలికాడు. బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు ఇతనిని కొనుగోలు చేసింది. లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్‌ను కూడా మంగళూరు డ్రాగన్స్ ఫ్రాంచైజీ రూ.7.6 లక్షలకు సొంతం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?