AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan: క్రికెట్ గ్రౌండ్‌లో సైఫ్ అలీ ఖాన్.. ప్రొఫెషనల్ ప్లేయర్‌లా బౌలింగ్, వీడియో వైరల్

Saif Ali Khan: లండన్‌లోని క్రికెట్ మైదానంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ క్రికెట్ వైట్స్‌లో బౌలింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రొఫెషనల్ ప్లేయర్‌లా కనిపించిన సైఫ్ నైపుణ్యాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తండ్రి టైగర్ పటాడీ క్రికెట్ వారసత్వంతో పాటు, సైఫ్ కుమారుడు తైమూర్‌కు కూడా క్రికెట్‌పై ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే.

Saif Ali Khan: క్రికెట్ గ్రౌండ్‌లో సైఫ్ అలీ ఖాన్.. ప్రొఫెషనల్ ప్లేయర్‌లా బౌలింగ్, వీడియో వైరల్
Saif Ali Khan
Rakesh
|

Updated on: Aug 12, 2026 | 3:05 PM

Share

Saif Ali Khan: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఒక క్రికెట్ మైదానంలో ఆయన తెల్లటి సాంప్రదాయ క్రికెట్ దుస్తులు ధరించి క్రికెట్ ఆడటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. గ్రౌండ్‌లో సైఫ్ ఎంతో ఉత్సాహంగా బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా వేదికల్లో బాగా వైరల్ అవుతోంది. ఆయన బంతిని విసిరిన తీరు, మైదానంలో ఆ నడుచుకున్న విధానం చూస్తుంటే ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌లా ఎంతో హుందాగా, ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయన క్రికెట్ నైపుణ్యాలను కొనియాడుతున్నారు.

సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి క్రికెట్‌తో ఎంతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. సైఫ్ తండ్రి, దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటాడీ (టైగర్ పటాడీ) భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రముఖమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. అలాగే సైఫ్ తాతగారైన ఇఫ్తికార్ అలీ ఖాన్ పటాడీ 1946లో భారత జట్టుకు నాయకత్వం వహించగా, అంతకుముందు 1932, 1934 లలో ఇంగ్లాండ్ టెస్టు జట్టు తరఫున కూడా ఆడారు. ఈ రకంగా రెండు దేశాల తరఫున ఆడిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. సైఫ్ తన తండ్రి నుంచి వచ్చిన క్రికెట్ సంస్కృతిని, అనుభవాన్ని తన కుమారుడైన తైమూర్ అలీ ఖాన్‌కు కూడా అందిస్తున్నారు. తైమూర్ లండన్‌లోని లార్డ్స్ మైదానంలో మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్ ఉస్మాన్ అఫ్జాల్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు.

ఇటీవలే కోల్‌కతాలో జరిగిన టైగర్ పటాడీ మెమోరియల్ లెక్చర్ 2026 కార్యక్రమంలో సైఫ్ అలీ ఖాన్ పాల్గొని తన తండ్రి గురించి భావోద్వేగంగా మాట్లాడారు. తండ్రి మన్సూర్ అలీ ఖాన్ చాలా తక్కువగా మాట్లాడేవారని, కానీ ఆయన మాటల్లో ఎంతో గంభీరత ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఎంత గొప్ప విజయాలు సాధించినా ఇంట్లో ఎప్పుడూ తన ఘనతల గురించి చెప్పేవారు కాదని అన్నారు. విదేశీ జట్ల ముందు భారత్ కేవలం పోటీపడటమే కాకుండా, గెలవాలనే ఆత్మవిశ్వాసాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో నూరిపోసిన గొప్ప నాయకుడు తన తండ్రి అని, భారత క్రికెట్ మానసిక దృక్పథాన్ని మార్చడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని సైఫ్ కొనియాడారు.

నటుడిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సైఫ్ అలీ ఖాన్ త్వరలోనే హైవాన్ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, బొమాన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియా పిల్‌గాంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us