BCCI Contract: జాక్పాట్ కొట్టిన పంజాబ్ కెప్టెన్? ఆ ముగ్గురికి షాక్ ఇవ్వనున్న BCCI
BCCI కొత్త కాంట్రాక్టుల జాబితా అధికారికంగా ప్రకటించనప్పటికీ, A+ కేటగిరీలో మార్పులు జరగనున్నట్లు సమాచారం. గతేడాది కాంట్రాక్టును కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఈసారి తిరిగి స్థానాన్ని సంపాదించుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా T20ల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంతో వారిని A+ కేటగిరీలో కొనసాగించే అవకాశాలు తగ్గాయి. జస్ప్రీత్ బుమ్రా మాత్రం మూడు ఫార్మాట్లలో ఆడే ఏకైక ఆటగాడిగా నిలవడం విశేషం.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మెన్ ఇన్ బ్లూ జట్టుకు సంబంధించిన కేంద్ర ఒప్పందాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ జాబితా విడుదల కావాల్సి ఉండటంతో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా A+ కేటగిరీలో మార్పుల గురించి క్రికెట్ విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతోంది. గతేడాది బీసీసీఐ కాంట్రాక్టును కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఈసారి A+ కేటగిరీలో చోటు సంపాదించనున్నట్లు సమాచారం.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వడంతో వారికి A+ కేటగిరీలో స్థానం ఉండకపోవచ్చు. ఈ కేటగిరీలో కొనసాగాలంటే ఆటగాళ్లు టెస్టులు, వన్డేలు, టీ20లు అన్నీ ఆడాలి. దీంతో ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు A కేటగిరీలో బీసీసీఐ కాంట్రాక్టులను పొందే అవకాశం ఉంది. ఇక, మహిళల జట్టు కోసం సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.
కాంట్రాక్టుల విభజన ఎలా ఉంటుంది? బీసీసీఐ త్వరలోనే సెంట్రల్ కాంట్రాక్టును ప్రకటించనుంది. కాంట్రాక్టుల విభజన ఈ విధంగా ఉంటుంది:
A+ కేటగిరీ – రూ.7 కోట్ల రిటైనర్ ఫీజు
A కేటగిరీ – రూ.5 కోట్లు
B కేటగిరీ – రూ.3 కోట్లు
C కేటగిరీ – రూ.1 కోటి
ఈ కాంట్రాక్టులను జాతీయ సెలక్షన్ కమిటీ తుది జాబితాను సిద్ధం చేసి, ప్రధాన కోచ్తో చర్చించిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా అపెక్స్ కౌన్సిల్ ముందుకు ఆమోదం కోసం పంపుతారు.
సీనియర్ ఆటగాళ్లందరినీ A+ కేటగిరీలో కొనసాగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ఈ టాప్ కేటగిరీలో ఉన్నారు. కానీ ఈసారి A+ కేటగిరీలో మార్పులు జరిగే అవకాశం ఉంది. A+ కేటగిరీలో ఉంటే ఆటగాడు అన్ని మూడు ఫార్మాట్లలో ఆడాలి. ఇప్పుడు సీనియర్ క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో ఆడే ఏకైక ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా మాత్రమే. బుమ్రా టెస్ట్ కెప్టెన్సీకి కూడా ప్రధానమైన అభ్యర్థిగా ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో A కేటగిరీ నుంచి తప్పుకుంటాడు.
గతేడాది బీసీసీఐ కాంట్రాక్టును కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఈసారి తిరిగి కాంట్రాక్ట్ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. 2024లో 11 వన్డేలు ఆడిన శ్రేయస్, ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత బ్యాటింగ్తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
బీసీసీఐ కాంట్రాక్టు పొందేందుకు ఆటగాడు ఒక క్యాలెండర్ సంవత్సరంలో కనీసం 3 టెస్టులు, 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడాలి. ఈ అర్హతను శ్రేయస్ అయ్యర్ పూర్తి చేసినందువల్ల అతనికి తిరిగి కాంట్రాక్ట్ లభించే అవకాశం ఉంది.
🚨 BCCI Contract Update [PTI] 🚨
🔹 Discussion to keep Rohit, Jaddu and Virat in A+ grade despite their T20I retirement.🔹 Axar and Yashasvi likely to be upgraded from B to A grade.🔹 Ravichandran Ashwin set to be removed.🔹 Shreyas Iyer may get a contract, but Ishan could… pic.twitter.com/d8iNVZnM9c
— CricketGully (@thecricketgully) March 24, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..