AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కోహ్లీని గెలికేసిన తోటి RCB ప్లేయర్! కింగ్ రియాక్షన్ అదుర్స్.. మీరే చూడండి

అహ్మదాబాద్ వన్డేలో విరాట్ కోహ్లీ, లియామ్ లివింగ్‌స్టోన్ మధ్య జరిగిన సరదా సంఘటన అభిమానులను ఆకర్షించింది. కోహ్లీ ఎల్‌బిడబ్ల్యూ కేసులో నాటౌట్‌గా నిలిచిన తర్వాత లివింగ్‌స్టోన్ సరదాగా ఆటపట్టించగా, కోహ్లీ నవ్వుతూ స్పందించాడు. భారత్ 356 పరుగుల భారీ స్కోరు చేసి, ఇంగ్లాండ్‌ను 214 పరుగులకు ఆలౌట్ చేసింది. 142 పరుగుల తేడాతో గెలిచిన భారత్, సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ముమ్మర శక్తిని అందుకుంది.

Video: కోహ్లీని గెలికేసిన తోటి RCB ప్లేయర్! కింగ్ రియాక్షన్ అదుర్స్.. మీరే చూడండి
Kohli
Narsimha
|

Updated on: Feb 13, 2025 | 4:07 PM

Share

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ మధ్య సరదాగా జరిగిన సంఘటన అభిమానులను విశేషంగా ఆకర్షించింది. మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో, ఆదిల్ రషీద్ వేసిన బంతిని ఆడే క్రమంలో కోహ్లీ బంతిని మిస్ చేసి బ్యాక్ ఫుట్‌కు తగిలింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎల్‌బిడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా, అంపైర్ తిరస్కరించాడు. రివ్యూకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు, బంతి లెగ్ స్టంప్ వెలుపల పిచ్ కావడంతో, కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు.

ఈ నిర్ణయంపై లియామ్ లివింగ్‌స్టోన్ కోహ్లీ వద్దకు వెళ్లి సరదాగా ఆటపట్టించేందుకు ప్రయత్నించగా, కోహ్లీ కూడా నవ్వుతూ లివింగ్‌స్టోన్‌ను సరదాగా నెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముఖ్యంగా, లివింగ్‌స్టోన్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున కోహ్లీతో కలిసి ఆడనున్నాడు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన వేలంలో అతడిని RCB రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన ప్రదర్శనను కనబరచింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, శుభ్‌మాన్ గిల్ (112), శ్రేయాస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52), కెఎల్ రాహుల్ (40) లాంటి బ్యాటర్లు రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తరఫున ఆదిల్ రషీద్ 4 వికెట్లు, మార్క్ వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ ఛేదనలో మంచి ఆరంభాన్ని ఇచ్చినా, వికెట్లను క్రమం తప్పకుండా కోల్పోయి 214 పరుగులకే ఆలౌటైంది. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ మొదటి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినా, మిగిలిన బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీసి, భారత విజయాన్ని ఖాయం చేశారు.

ఈ ఘన విజయంతో భారత జట్టు 142 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు ఇది పెద్ద ఉత్సాహాన్నిచ్చింది. కోహ్లీ, లివింగ్‌స్టోన్ మధ్య జరిగిన సరదా సంఘటనతో పాటు, భారత్ అద్భుతమైన విజయంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాలు- మఖానా కలిపి తీసుకుంటున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు
పాలు- మఖానా కలిపి తీసుకుంటున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు
గ్యాస్​ సిలిండర్​‌పై ఈ అక్షరాలు మీకు కనిపించాయా..
గ్యాస్​ సిలిండర్​‌పై ఈ అక్షరాలు మీకు కనిపించాయా..
ఇందిరమ్మ ఇళ్లలో ఏఐ ఫిల్టర్‌.. అర్హులకు న్యాయం, అనర్హులకు షాక్‌
ఇందిరమ్మ ఇళ్లలో ఏఐ ఫిల్టర్‌.. అర్హులకు న్యాయం, అనర్హులకు షాక్‌
వర్రా ఈ జేకబ్ డఫీ..? సన్‌రైజర్స్ వెన్నులో వణుకు పుట్టించాడుగా..!
వర్రా ఈ జేకబ్ డఫీ..? సన్‌రైజర్స్ వెన్నులో వణుకు పుట్టించాడుగా..!
మొక్కలు ఎండిపోతున్నాయా? ఈ టిప్స్‌తో మళ్లీ పచ్చగా మార్చండి!
మొక్కలు ఎండిపోతున్నాయా? ఈ టిప్స్‌తో మళ్లీ పచ్చగా మార్చండి!
ఆది సాయి కుమార్ కొడుకు పేరెంటో తెలుసా.. ?
ఆది సాయి కుమార్ కొడుకు పేరెంటో తెలుసా.. ?
ఏపీ బీజేపీలో మూడు గ్రూపులు..ఆ కీలక నేతల మౌనం.. TV9 క్రాస్‌ఫైర్‌లో
ఏపీ బీజేపీలో మూడు గ్రూపులు..ఆ కీలక నేతల మౌనం.. TV9 క్రాస్‌ఫైర్‌లో
మీ కష్టార్జితానికి అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్‌లు ఇవే!
మీ కష్టార్జితానికి అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్‌లు ఇవే!
బ్లాక్ బ్యాండ్‌లతో బరిలోకి ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
బ్లాక్ బ్యాండ్‌లతో బరిలోకి ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
క్రికెటర్ల రిటైర్మెంట్‌కు వాళ్లే కారణం.. నోరు జారిన యూపీ తండ్రి
క్రికెటర్ల రిటైర్మెంట్‌కు వాళ్లే కారణం.. నోరు జారిన యూపీ తండ్రి