AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్‌కు షాకిచ్చాడు.. రోహిత్‌ను వెలికితీశాడు.. కట్‌చేస్తే.. విరిగిన కాలితోనే రూ. 100 కోట్ల సామ్రాజ్యం

క్రికెట్ చరిత్రలో కొంతమంది ఆటగాళ్లు మైదానంలో కంటే మైదానం వెలుపల ఎక్కువ ప్రభావాన్ని చూపుతారు. అలాంటి ఒక అరుదైన వ్యక్తి జతిన్ పరంజపే. 14 ఏళ్ల వయసులో సాక్షాత్తూ సచిన్ టెండూల్కర్‌నే వెనక్కి నెట్టి 'బెస్ట్ జూనియర్ క్రికెటర్' అవార్డు గెలుచుకున్న జతిన్, దురదృష్టవశాత్తూ గాయం వల్ల కెరీర్ కోల్పోయారు. కానీ, అదే గాయాన్ని ఒక అవకాశంగా మలుచుకుని నేడు రూ. 100 కోట్ల విలువైన క్రీడా సామ్రాజ్యాన్ని స్థాపించారు. రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను వెలికితీయడంలో కీలక పాత్ర పోషించిన ఈ 'మిస్టర్ ఆల్ రౌండర్' సక్సెస్ స్టోరీ మీకోసం.

సచిన్‌కు షాకిచ్చాడు.. రోహిత్‌ను వెలికితీశాడు.. కట్‌చేస్తే.. విరిగిన కాలితోనే రూ. 100 కోట్ల సామ్రాజ్యం
Jatin Paranjpe
Venkata Chari
|

Updated on: Jan 05, 2026 | 1:48 PM

Share

జతిన్ పరంజపే పేరు వినగానే 90వ దశకంలో క్రికెట్ చూసిన వారికి టొరంటోలో పాకిస్థాన్‌పై అతను ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గుర్తొస్తుంది. కానీ, అతని కథ కేవలం ఆ నాలుగు వన్డేలకే పరిమితం కాదు. 1986-87 కాలంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ‘జూనియర్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించాల్సి ఉంది. ఆ రేసులో అప్పటికే సంచలనం సృష్టిస్తున్న 14 ఏళ్ల సచిన్ టెండూల్కర్ ఉన్నారు. కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఏడాది జతిన్ పరంజపే ఆ అవార్డును దక్కించుకున్నాడు. సచిన్ వంటి దిగ్గజాన్ని ఓడించాడంటే అప్పట్లో జతిన్ ఎంత ప్రతిభావంతుడో అర్థం చేసుకోవచ్చు.

రోహిత్ శర్మను వెలికితీసిన గురువు..

జతిన్ తండ్రి వాసు పరంజపే ముంబై క్రికెట్‌లో లెజెండరీ కోచ్. రోహిత్ శర్మను చిన్నతనంలోనే గుర్తించి, అతనికి సరైన దిశానిర్దేశం చేసింది వీరే. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జతిన్ కూడా సెలెక్టర్‌గా ఉన్న సమయంలో రోహిత్ శర్మలోని టాలెంట్‌ను గుర్తించి అండగా నిలిచారు. కేవలం రోహిత్ మాత్రమే కాదు, విరాట్ కోహ్లీని ప్యూమా బ్రాండ్‌కు పరిచయం చేయడంలో కూడా ఇతని పాత్ర ఉంది.

విరిగిన కాలు.. మలుపు తిరిగిన జీవితం..

1998లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జతిన్, కేవలం నాలుగు మ్యాచ్‌ల తర్వాత ఫీల్డింగ్ చేస్తూ తీవ్రమైన కాలి మడమ గాయానికి గురయ్యారు. ఆ కాలంలో క్రీడా వైద్యం అంతగా అభివృద్ధి చెందకపోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. ఏడేళ్ల కష్టంతో సంపాదించుకున్న టీమిండియా క్యాప్, ఒక చిన్న గాయంతో చేజారిపోయింది.

ఇవి కూడా చదవండి

వ్యాపార సామ్రాజ్యం – ఖేలోమోర్: క్రికెట్ ఆడలేకపోయినా, క్రీడా రంగాన్ని వదలకూడదని నిర్ణయించుకున్న జతిన్, కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టారు. నైక్ వంటి దిగ్గజ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన తర్వాత, 2017లో ‘ఖేలోమోర్’ (KheloMore) అనే స్టార్టప్‌ను ప్రారంభించారు.

ఇది క్రీడా కోచ్‌లు, అకాడమీలు, క్రీడాకారులను అనుసంధానించే ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్. ప్రస్తుతం ఈ సంస్థ విలువ రూ. 100 కోట్లకు పైగానే ఉంది. డ్రీమ్ 11 (Dream11) వంటి సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.

వ్యక్తిగత జీవితం: జతిన్ పరంజపే బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి బింద్రే సోదరి గంధాలీని వివాహం చేసుకున్నారు. గంధాలీ కూడా అతని వ్యాపారంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది” అనే మాట జతిన్ పరంజపే జీవితానికి సరిగ్గా సరిపోతుంది. మైదానంలో బౌలర్లకు దొరకని జతిన్, జీవితం విసిరిన సవాలును స్వీకరించి ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్‌మెన్‌గా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us