AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు.. మీ పేరును ఇలా చెక్ చేసుకోండి..

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మరికొన్ని గంటల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేయనుంది. అస్సాం రాజధాని గౌహతి వేదికగా ప్రధాని మోదీ పీఎం-కిసాన్ 22వ విడత నిధులను విడుదల చేయనున్నారు. సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది.

PM Kisan: గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు.. మీ పేరును ఇలా చెక్ చేసుకోండి..
Pm Modi To Release 22nd Installment On March 13
Krishna S
|

Updated on: Mar 12, 2026 | 8:23 PM

Share

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా 22వ విడత నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 13న అస్సాం రాజధాని గౌహతి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దీన్ని వల్ల దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల 23 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.18,640 కోట్లు జమ కానున్నాయి.

మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి..

  • పీఎం-కిసాన్ అధికారిక వెబ్‌సైట్ [pmkisan.gov.in](https://pmkisan.gov.in) సందర్శించండి.
  •  హోమ్ పేజీలో Farmer Corner విభాగంలో Beneficiary Status పై క్లిక్ చేయండి.
  •  మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను ఎంచుకోండి.
  •  మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేయండి.
  •  చివరగా Get Report పై క్లిక్ చేస్తే మీ స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఈ నిబంధనలు తప్పనిసరి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. డేటా సరిగ్గా ఉన్న రైతులకు మాత్రమే ఈ నిధులు అందుతాయి

  • మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయి ఉండాలి.
  • రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి వివరాలు అప్‌డేట్ అయ్యి ఉండాలి.
  • ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి.

పీఎం-కిసాన్ పథకం నేపథ్యం

పేద రైతులకు ఆర్థిక ఆసరా అందించే లక్ష్యంతో2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దీని ద్వారా ఏడాదికి రూ.6,000 చొప్పున, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 మూడు విడతల్లో ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు విడుదల చేసిన 21 విడతల్లో భాగంగా మొత్తం రూ..4.09 లక్షల కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలకు బదిలీ చేయడం విశేషం. గత 21వ విడత నిధులు నవంబర్ 19న కోయంబత్తూరులో విడుదల చేశారు.

Follow Us