AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India A vs England A: ఓరినాయనో ఈయన మొదలెట్టేసాడుగా! సెంచరీతో క్రిటిక్స్ నోరు మూయించిన డొమెస్టిక్ డైనమైట్!

ఇంగ్లాండ్ A పై తొలి అనధికారిక టెస్టులో కరుణ్ నాయర్ అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరచి భారత A జట్టును నిలదొక్కాడు. ఈ ప్రదర్శనతో విమర్శకుల నోరులు మూయించిన కరుణ్, జాతీయ జట్టులో మళ్లీ అవకాశాలు తెరుస్తున్నాడు. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో అతనికి మూడో లేదా నాలుగో స్థానంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

India A vs England A: ఓరినాయనో ఈయన మొదలెట్టేసాడుగా! సెంచరీతో క్రిటిక్స్ నోరు మూయించిన డొమెస్టిక్ డైనమైట్!
Karun Nair Indiaa
Narsimha
|

Updated on: May 30, 2025 | 10:26 PM

Share

ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టులోకి ఎంపికైన తర్వాత విమర్శల పరంపరను ఎదుర్కొన్న కరుణ్ నాయర్, తన బ్యాట్‌తో అందరికీ ఘనమైన సమాధానం ఇచ్చాడు. 33 ఏళ్ల కరుణ్, కాంటర్బరీలోని సెయింట్ లారెన్స్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్ A తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఇది అతని 24వ సెంచరీ. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్, అనుభవజ్ఞుడిగా సుతారంగా ఆడి 14 బౌండరీలతో తన శైలిని చూపించాడు. ఆత్మవిశ్వాసంగా ఆడిన అతను, శతకం పూర్తి చేస్తూ టీమ్‌కి భరోసానిచ్చాడు. అతనికి సహబాట్స్మన్‌గా సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా మద్దతు ఇచ్చాడు. సర్ఫరాజ్ కేవలం 119 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు, దీంతో భారత A జట్టు 51/2 అనే క్లిష్టమైన స్థితి నుండి 232/3కి మెరుగైన స్థాయికి చేరింది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ భారీగా విఫలమయ్యాడు. కేవలం 17 బంతుల్లో ఎనిమిది పరుగులే చేసి ఔట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ కొంత ఆరంభం ఇచ్చినా, ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ నేపథ్యంలో కరుణ్-సర్ఫరాజ్ భాగస్వామ్యం జట్టుకు అవసరమైన స్థిరతను అందించింది. ఆ తర్వాత కరుణ్ 114 పరుగులతో అజేయంగా నిలవగా, ధ్రువ్ జురెల్ 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

కరుణ్ నాయర్ ఈ ప్రదర్శనతో తనను విమర్శించినవారికి సమాధానం ఇచ్చినట్టే అయింది. ముఖ్యంగా అతను మూడో స్థానంలో రాణించడం వల్ల భారత జట్టులో నంబర్ 3 లేదా 4 స్థానంలో అతనికి అవకాశాలు తెరవబోతున్నాయా అనే చర్చలు మొదలయ్యాయి. జూన్ 20న లీడ్స్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుంటే, శుభ్‌మాన్ గిల్ పూర్తిస్థాయి కెప్టెన్సీ చేపట్టే అవకాశముండగా, మధ్య క్రమంలో నాయర్‌కి స్థానం లభించవచ్చు. జట్టు బ్యాటింగ్ క్రమంలో స్థిరత కోసం చూస్తుండగా, కరుణ్ లాంటి అనుభవజ్ఞుడి ఫామ్‌ కీలకంగా మారనుంది.

ఇది రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కావడం విశేషం. రెండో టెస్ట్ జూన్ 6 నుంచి నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శన కరుణ్ నాయర్‌కు తిరిగి జాతీయ జట్టులో స్థిరంగా నిలిచే అవకాశాలను పెంచే అవకాశం ఉన్నది. గతంలో ట్రిపుల్ సెంచరీతో ఆకట్టుకున్న కరుణ్, ఇప్పుడు మళ్లీ తన సత్తా నిరూపిస్తూ, భారత క్రికెట్‌లో మళ్లీ తన స్థానాన్ని గెలుచుకునేందుకు గట్టిగా పయనిస్తున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..