మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం కొందరు పిచ్చి చేష్టలతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఘటనలూ ఉన్నాయి. కానీ, ప్రస్తుతం మెట్రోరైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అందమైన అనుభవం ఎదురైంది. దానికి సంబంధించిన వివారాలు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
బెంగళూరులో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్న రీతూ జూన్ అనే యువతి జనవరి 12న మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఆమె పక్కన కూర్చున్న ఓ బాలిక చేతికి ఉన్న బంగారు గాజు డిజైన్ ఆమెకు బాగా నచ్చింది. దాంతో తనుకూడా అలాంటి గాజునే చేయించుకోవాలని భావించారు. దాంతో ఆ గాజు ధరించిన బాలికను ఆ గాజును ఒక ఫొటో తీసుకోవచ్చా? అని అడిగారు. అందుకు ఆ బాలిక ఏమాత్రం ఆలోచించకుండా తన చేతికున్న గాజును తీసి రీతూ చేతిలో పెట్టింది. డిజైన్ స్పష్టంగా కనిపించడానికి ఫొటో తీసుకోవడం మీకు ఈజీగా ఉంటుందని చెప్పింది. ఆమె నమ్మకానికి రీతూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ బాలిక నవ్వుతూ అది నిజమైన బంగారం కాదని, ఆర్టిఫిషియల్ గాజు అని చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం :
బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వైరల్ వీడియోలు
చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మా
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు..

