IPL 2025: అరంగేట్రంలోనే అరుదైన చెత్త రికార్డులో చేరిన బట్లర్ రీప్లేస్మెంట్ ప్లేయర్! ఇదే సీజన్లో మూడో ప్లేయర్ గా..
గుజరాత్ టైటాన్స్ తరఫున కుశాల్ మెండిస్ ఐపీఎల్లో అరంగేట్రం చేసి రెండవ క్యాచ్లు వదిలి నిరాశపరిచాడు. బ్యాటింగ్లో ఆకట్టుకునే ఆరంభం ఇచ్చినా, హిట్ వికెట్ రూపంలో అనూహ్యంగా అవుటయ్యాడు. దీంతో ఐపీఎల్ 2025లో హిట్ వికెట్ అవుట్ అయిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. బట్లర్ స్థానంలో వచ్చిన మెండిస్కి ఈ అరంగేట్రం చేదు జ్ఞాపకంగా మిగిలింది.

ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తరఫున శ్రీలంక బ్యాట్స్మన్ కుసల్ మెండిస్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అయితే, ఈ మ్యాచ్ అతనికి తీపి కాకుండా, ఒక వింత అనుభవాన్ని మిగిల్చింది. రెండు పెద్ద క్యాచ్లను వదిలేసి ఫీల్డింగ్లో నిరాశపరిచిన మెండిస్, బ్యాటింగ్లో రాణించాలని పట్టుదలగా క్రీజులోకి వచ్చాడు. కొన్ని ఆకర్షణీయమైన బౌండరీలు కొట్టి మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ, అతని ఇన్నింగ్స్ ఓ వింత హిట్వికెట్ రూపంలో ముగిసింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్ చేస్తున్న ఏడో ఓవర్లో, అతను తన స్థానం కోల్పోయి వెనక్కి తొక్కుతూ పొరపాటుగా తన కుడి కాలితో స్టంప్స్ను తాకాడు. కీపర్ బంతిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 10 బంతుల్లో 20 పరుగులు చేసిన తర్వాత, ఈ వింత తీరులో మెండిస్ అవుట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ అనూహ్య అవుట్తో ఐపీఎల్ 2025లో హిట్ వికెట్ ద్వారా ఔట్ అయిన మూడవ బ్యాట్స్మన్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ తరపున అభినవ్ మనోహర్, అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కృనాల్ పాండ్యా ఇదే విధంగా హిట్ వికెట్ ద్వారా ఔటయ్యారు. ముగ్గురు అద్భుత ఆటగాళ్లు ఒకే సీజన్లో ఇలా అవుట్ కావడం అరుదైన దృశ్యమే. జోస్ బట్లర్ జాతీయ విధుల నేపథ్యంలో టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసిన కుశాల్ మెండిస్కు ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం.
మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో అద్భుతంగా ఆరంభించారు. ఇద్దరూ బౌండరీల వర్షం కురిపించి గుజరాత్ బౌలర్లపై ఒత్తిడి సృష్టించారు. టైటాన్స్ రోహిత్ ఇచ్చిన రెండు క్యాచ్లను వదులుకోవడంతో, అతను మరింత దూకుడుగా ఆడేందుకు ప్రేరణ పొందాడు. రోహిత్ 50 బంతుల్లో 81 పరుగులు చేయగా, బెయిర్స్టో 22 బంతుల్లో 47 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 25, హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 22 పరుగులతో రాణించగా, ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ప్రత్యుత్తరంగా గుజరాత్ టైటాన్స్ ఆరంభమే బలహీనంగా చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలి ఓవర్లోనే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో అవుటయ్యాడు. అయితే, సాయి సుదర్శన్, కుశాల్ మెండిస్ కలిసి బౌండరీలతో స్కోరు పెంచారు. మెండిస్ 10 బంతుల్లో 20 పరుగులు చేసిన తర్వాత హిట్ వికెట్ రూపంలో అవుటయ్యాడు. ఈ సీజన్లో హిట్ వికెట్ అవుట్ అయిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. సుదర్శన్ 80 పరుగులు చేసి జట్టుకు ఆశానురూపంగా నిలిచాడు, కానీ రిచర్డ్ గ్లీసన్ అతన్ని అవుట్ చేసి గేమ్ని ముంబై వైపు తిప్పేశాడు. షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వాషింగ్టన్ సుందర్ మాత్రం 24 బంతుల్లో 48 పరుగులతో పోరాడాడు. అయితే, మొత్తం మీద 208 పరుగులకే గుజరాత్ పరిమితమై, 20 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



